Boy Suicide Hyderabad Today :ప్రేమ నిరాకరించిందని బాలికపై హత్యాయత్నం చేసిన ఓ బాలుడు భయంతో గురువారం అర్ధరాత్రి విద్యానగర్- జామియా ఉస్మానియా స్టేషన్ల మధ్య రైలు కింద పడి బలవన్మరణానికి(Suicide) పాల్పడ్డాడు. మృతుడు అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో బాలికపై కత్తితో దాడికి పాల్పడిన బాలుడిగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తూర్పు మండలం డీసీపీ సాయిశ్రీ వివరాల ప్రకారం :బాగ్అంబర్పేట తురాబ్నగర్లో ఉండే రమణ(16), బాలిక ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుకున్నారు. ఇటీవల బాలిక తల్లి మరణించడంతో ఆమె వాడిన టైలరింగ్ సామాగ్రిని అమ్మకానికి పెట్టారు బాలిక కుటుంబ సభ్యులు. ఆ సామగ్రిని రమణ కుటుంబం కొనుగోలు చేసింది. ఈ క్రమంలో బాలికతో మళ్లీ పరిచయం ఏర్పరుచుకున్న రమణ కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేయడంతో ఆమె తిరస్కరించింది. రమణ అక్కడితో ఆగకుండా తరచూ బాలిక మొబైల్ ఫోన్కు మెసేజ్లు పంపుతూ ఉండేవాడు. కనిపించిన ప్రతిసారి అడ్డగించి వేధించసాగాడు. ఈ వేధింపులు తీవ్రతరమైనా బాలిక భరిస్తూనే వచ్చింది కానీ ఎవరికీ చెప్పుకోలేకపోయింది.
మయోనైజ్ తిని 17 మందికి అస్వస్థత - రక్తపరీక్షల్లో ఏం తేలిందంటే?