తెలంగాణ

telangana

కశ్మీర్​లో పోలీసులపై కాల్పులు.. ఇద్దరికి గాయాలు

By

Published : Dec 23, 2019, 5:19 AM IST

Updated : Dec 23, 2019, 7:39 AM IST

జమ్ము కశ్మీర్​ కిష్త్​వార్​​ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో  ఇద్దరు పోలీసు అధికారులు (ఎస్​పీఓలు)గాయపడ్డారు. విధుల్లో ఉన్న వీరిరువురిపై రాత్రి 10 గంటల సమయంలో అనుమానాస్పద రీతిలో కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

jk firing
కశ్మీర్​లో పోలీసులపై కాల్పులు.. ఇద్దరికి గాయాలు

జమ్ము కశ్మీర్​ కిష్త్​వార్​​​ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులపై ఆదివారం రాత్రి కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ జరిగింది

ఆదివారం రాత్రి సెమినా కాలనీలోని ఫిల్​ట్రేషన్​ ప్లాంట్​ వద్ద ప్రత్యేక పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో వారిపై కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దం వినబడిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్​ గాయాలతో పడివున్న వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక దర్యాప్తులో ఇది ఉగ్రవాదుల దాడి కాదని నిర్ధరించారు. కాల్పులకు సంబంధించిన వాస్తవాలను గురించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : ముంబయి: 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

New Delhi, Dec 22 (ANI): Candlelight march was orgainised by Jamia students on Dec 21. The march was attended by Congress leader Asif Khan and large number of people to mark of protest against CAA. Nation-wide protests intensified after implementation of new Citizenship Act. CAA will grant Indian Citizenship to religious minorities from 3 neighbouring countries.
Last Updated : Dec 23, 2019, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details