తెలంగాణ

telangana

Ahmednagar Train Fire : రైలులో భారీ అగ్నిప్రమాదం.. 5 కోచ్​లకు మంటలు.. లక్కీగా..

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 6:16 PM IST

Updated : Oct 16, 2023, 7:40 PM IST

Ahmednagar Train Fire : డెము రైలులో భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. 5 కోచ్​లకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

Ahmednagar Train Fire
Ahmednagar Train Fire

Ahmednagar Train Fire : మహారాష్ట్రలో ఓ రైలు ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. డెము రైలులోని 5 కోచ్​లలో మంటలు చెలరేగాయి. అహ్మద్​నగర్, నారాయణ్​పుర్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు రైలులో మంటలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. మంటలు వ్యాపించగానే రైలులో ఉన్నవారిని కిందకు దించినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన కోచ్​లలో ఎవరూ చిక్కుకోలేదని, అధికారులు వెంటనే అగ్నిమాపక బృందాలకు సమాచారం అందించారని వివరించారు. రైలు బీడ్ జిల్లాలోని ఆష్టి స్టేషన్ నుంచి అహ్మద్ నగర్​కు వెళ్తోందని అధికారులు తెలిపారు.

మంటల్లో కాలిపోతున్న రైలు

'సాయంత్రం 4.10 నాటికి మంటలు అదుపులోకి'
"01402 నంబర్ రైలు అహ్మద్​నగర్​కు వెళ్తోంది. దారి మధ్యలో రైలులో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. మంటలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొదలయ్యాయి. మంటలు వ్యాపించక ముందే బోగీలో ఉన్నవారంతా కిందకు దిగేశారు. గార్డు పక్కన ఉండే బ్రేక్ వ్యానుతో పాటు దానికి అనుబంధంగా ఉన్న నాలుగు కోచ్​లకు మంటలు వ్యాపించాయి. అహ్మద్​నగర్ నుంచి వెంటనే అంబులెన్సులను పిలిపించాం. సాయంత్రం 4.10 నాటికి మంటలు అదుపులోకి వచ్చాయి. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్​ను పుణెలోని దౌండ్ స్టేషన్ నుంచి ఘటనా ప్రదేశానికి రప్పించాం" అని రైల్వే అధికారులు వివరించారు.

మంటల్లో కాలిపోతున్న రైలు

ఇంజిన్​లో మంటలు..
ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ఇటీవల ఓ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఖజురహో ఉదయ్​పుర్ ఇంటర్​సిటీ ట్రైన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్​లో మంటలు రావడం వల్ల అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపేశారు. ఆందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరిగెత్తారు. రైలును పూర్తిగా నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు గంటల పాటు రైలు కదలకుండా అక్కడే ఆగిపోయింది. ప్రమాదానికి గురైన ఇంజిన్​ను తొలగించి మరో ఇంజిన్​తో రైలును గమ్యస్థానానికి చేర్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామని ఉత్తర మధ్య రైల్వే సీపీఆర్ఓ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ ఆ సమయంలో వెల్లడించారు.

డీజిల్​ డ్రమ్ముల వ్యాన్​ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది సజీవదహనం.. మరో 16 మంది..

South Africa Fire Accident : అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం.. 73 మంది మృతి.. అనేక మందికి గాయాలు

Last Updated : Oct 16, 2023, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details