ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రెండు ఫొటోలు వైరల్గా మారాయి. ఆ ఫొటోల్లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(modi yogi photo).. యోగి భుజాలపై చెయ్యి వేసి మాట్లాడుతూ కనిపించారు.
అసెంబ్లీ ఎన్నికలు(up elections 2022) సమీపిస్తున్న తరుణంలో.. ఉత్తర్ప్రదేశ్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం రాత్రి నుంచి లఖ్నవూలోని రాజ్భవన్లో బస చేస్తున్నారు. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి యోగి ఆయన్ను కలిశారు. అప్పుడే రాజ్భవన్లోని ప్రాంగణంలో మోదీ-యోగి మాటల్లో మునిగిపోయారు. ఈ సమయంలోనే మోదీ.. యోగి భుజాలపై చెయ్యి వేశారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. 'నవ భారత్' అని క్యాప్షన్ జోడించారు యోగి.