తెలంగాణ

telangana

పెళ్లైన మూడు నెలలకే భార్యను అమ్మేసిన భర్త!

By

Published : Oct 23, 2021, 7:52 PM IST

ప్రేమపెళ్లి చేసుకున్న మూడు నెలలకే భార్యను అమ్మేశాడు ఓ భర్త. ఆర్థిక సమస్యలున్నాయని పని కోసం ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే వేరే వ్యక్తి ఇంట్లో వదిలేసి వచ్చాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

a-husbandallegdely-sold-her-wife-three-months-after-marriage-citing-some-financial-issues
పెళ్లైన మూడు నెలలకే భార్యను అమ్మేసిన భర్త!

ఒడిశా బొలంగిర్​కు చెందిన ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మూడు నెలలకే అమ్మేశాడు. పనికోసం అని చెప్పి ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి వచ్చాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. బాధితురాలిని కాపాడి కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఏం జరిగిందంటే...

పెళ్లైన మూడు నెలలకే భార్యను అమ్మేసిన భర్త!

ఒడిశా బెల్​పారా పోలీస్ స్టేషన్​ పరిధిలోని సులేకేలా గ్రామానికి చెందిన సరోజ్ రాణాకు బొలంగిర్​కు చెందిన రేవతి(పేరు మార్చాము)తో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన మూడు నెలల తర్వాత ఆర్థిక సమస్యలున్నాయని, ఇటుకల బట్టీలో పనిచేద్దామని చెప్పి భార్యను రాయ్​పుర్ తీసుకెళ్లాడు సరోజ్​. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను రాజస్థాన్​లోని ఓ గ్రామనికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి ఇంట్లో వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత రేవతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని చెప్పాడు. అతడిపై అనుమానం వచ్చిన బాధితురాలి కుటుంబసభ్యులు బెల్​పారా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రేవతిని కాపాడి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. సరోజ్​ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్​తో భార్య మృతి- నలుగురు పిల్లలతో కలిసి భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details