తెలంగాణ

telangana

4 Dead Bodies Found In Home : విగతజీవులుగా ఒకే ఇంట్లోని నలుగురు.. కుళ్లిన మృతదేహాలు.. ఆత్మహత్యనా? లేక?

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 7:17 AM IST

4 Dead Bodies Found In Home : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. అనుమానాస్పద రీతిలో తమ ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు. అప్పుల బాధతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

Dead bodies of four of the same family were found mysuru
Dead bodies of four of the same family were found mysuru

4 Dead Bodies Found In Home : కర్ణాటకలోని మైసూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద రీతిలో మరణించారు. నలుగురి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మృతులను మహదేవస్వామి కుటుంబసభ్యులుగా గుర్తించినట్లు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని బరదనపుర్​ గ్రామానికి చెందిన మహదేవస్వామి(48).. మైసూరు నగరంలో ఆర్‌ఎంసీ మార్కెట్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. మహదేవస్వామి.. తన భార్య అనిత(35), ఇద్దరు కుమార్తెలతో చాముండిపురం కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. విద్యారణ్యపురంలో కొన్నేళ్లు పాటు నివాసం ఉన్న మహదేవస్వామి కుటుంబుం.. ఇటీవలే చాముండిపురం కాలనీలోకి వచ్చింది.

అయితే ఆదివారం మధ్యాహ్నం.. మహదేవస్వామి ఇంటి నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. తలుపులు బద్దలుకొట్టి లోపలకి వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంటి హాలులో మహదేవస్వామి మృతదేహం.. లభ్యమైందని పోలీసులు తెలిపారు. కుర్చీపై భార్య అనిత, గదిలో కుమార్తెలు విగతజీవులుగా కనిపించారని పోలీసులు చెప్పారు. రెండ్రోజుల క్రితమే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారంలో నష్టం రావడం వల్లే మహదేవ స్వామి అప్పులపాలయ్యాడని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మృతుడు మహదేవస్వామి తండ్రి సోమప్ప కూడా కొన్ని నెలల క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు. మహదేవస్వామి ఆర్థిక పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం లేదని మృతుడి సోదరుడు అశోక్ తెలిపాడు. లోన్​ తీసుకున్నాడో లేదో కూడా తనకు తెలియదని చెప్పాడు. మహదేవస్వామి మాతో పెద్దగా టచ్‌లో లేరని అతడి అత్త విశాలాక్షి.. పోలీసులకు చెప్పింది.

భార్యాపిల్లలకు విషమిచ్చి..
మరోవైపు, రాజస్థాన్​లో జయపురలో ఓ వ్యక్తి.. తన భార్యాపిల్లలకు ఆహారంలో విషం కలిపి ఇచ్చి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే అతడు ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం..నగరంలోని ప్రతాప్​నగర్​లో ఓ అద్దె ఇంట్లో మనోజ్​ శర్మ అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో నివాసం ఉంటున్నాడు. అతడు కొన్ని నెలలుగా అప్పుల సమస్యతో బాధపడుతున్నాడు. అయితే తన భార్యాపిల్లలు చంపి.. తాను కూడా చనిపోదామని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా.. మార్కెట్​కు వెళ్లి విషం తెచ్చాడు.

ఇంట్లో తయారు చేసిన హల్వాలో భార్యకు తెలియకుండా విషం కలిపేశాడు. అది తిన్న మనోజ్ భార్య సాక్షి, అతడి కుమారుడు అథర్వ్​, కుమార్తె నియా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే మనోజ్​ భార్య, కుమారుడు మృతి చెందారు. మనోజ్​తోపాటు అతడి కుమార్తె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విద్యార్థినిపై హత్యాచారం..​ రూమ్​లో నగ్నంగా మృతదేహం.. సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

అత్యాచారానికి గురైన అక్కాచెల్లెళ్లు.. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details