మూడేళ్ల చిన్నారి లాకప్ డెత్ అయిన ఘటన కర్ణాటకలోని కలబురిగీలో కలకలం రేపింది. దీంతో వందల సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. బాలిక మృతిపై నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేస్తామన్న పోలీసుల హామీతో నిరసనకారులు వెనక్కితగ్గారు.
అసలేం జరిగింది?
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన గొడవల్లో భాగంగా ఓ మహిళను జేవార్జీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటే తన మూడేళ్ల పాపనూ జైలుకు తరలించారు. చిన్నారికి అనారోగ్యంగా ఉందని గుల్బర్గా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(జీఐఎంఎస్) కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు.
-సిమి మరియం జార్జి, కలబురిగీ ఎస్పీ.
ఎమ్మెల్యే నిరసన
విషయం తెలుసుకున్న జేవార్జీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే డా.అజయ్ సింగ్ తన అనుచరులతో కలిసి ఠాణా ముందు బైఠాయించారు. 'డిసెంబర్ 30న గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. అందులో భాగంగానే ఆ మహిళను అరెస్ట్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ వర్గీయులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే భాజపా వారికి ఒక్క రోజులోనే స్టేషన్ బెయిల్ వచ్చింది. పాప మృతికి పోలీసులు బాధ్యత వహించాలి' అని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే ఇదీ చదవండి: 'రాజకీయ ఒత్తిళ్ల వల్లే గంగూలీకి గుండెపోటు'