ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్ర బృందానికి షాక్ ఇచ్చిన రాష్ట్ర అధికారులు- పాత తేదీల ఫోటోలు పెట్టడాన్ని తప్పుపట్టిన బృందం సభ్యులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 7:26 PM IST

Updated : Dec 14, 2023, 8:12 PM IST

cyclone_affected_areas

Central Team Visit to Cyclone Affected Areas:నెల్లూరు జిల్లాలో మిగ్ జాం తుపాన్​ ప్రభావిత ప్రాంతాల్లో (Michaung Cyclone Impact in AP) కేంద్ర బృందం పర్యటించింది. కోవూరు, ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో తుపాన్​ ప్రభావంతో దెబ్బతిన్న అరటి, తమలపాకు, వరి పంటలను కేంద్ర బృందం అధికారులు రాజేంద్ర రత్ను, విక్రం సింగ్​లు పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు నష్టపోయిన రైతులను తమ సమస్యను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం వెంట జిల్లా అధికారులు ఉన్నారు. 

అనంతరం కలెక్టరేట్​లోని తిక్కన భవన్​లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్​ని తిలకించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్​లో మిగ్ జాం తుపాన్​కు ముందు తారీఖులతో కొన్ని ఫోటోలు పెట్టి ఉండటాన్ని కేంద్ర అధికారులు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో సంభవించిన నష్టాలను పరిశీలించి కేంద్రానికి నివేదిస్తామని కేంద్ర అధికారి రాజేంద్ర రత్ను తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలోని పర్యటించిన అనంతరం తిరుపతికి బయల్దేరనున్నారు.

Last Updated :Dec 14, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details