ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాయమాటలు చెప్పిన జగన్​.. బీసీలను నట్టేట ముంచారు: చంద్రబాబు

By

Published : Dec 1, 2022, 1:59 PM IST

Updated : Dec 1, 2022, 3:48 PM IST

CBN FIRES ON CM JAGAN : మాయమాటలు చెప్పిన జగన్‌.. బీసీలను నట్టేట ముంచారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పేరుకే బీసీలకు పదవులని.. పెత్తనమంతా అగ్రకులాలదేనని మండిపడ్డారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు ఇచ్చే ప్రాధాన్యం అత్యల్పం అన్నారు. వీసీలు, సలహాదారులు ఏ కులంవారో చర్చకు జగన్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు.

CBN FIRES ON CM JAGAN
CBN FIRES ON CM JAGAN

CBN MEETING WITH BC LEADERS: బీసీల పొట్టగొట్టిన జగన్‌రెడ్డి.. తన పొట్ట నింపుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. బీసీలకు ఇదేం ఖర్మ అని.. బీసీ సంఘాలు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని పిలుపు నిచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో.. బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేరుకు మాత్రమే బీసీలకు కొన్ని పదవులు ఇచ్చి.. పెత్తనం అంతా అగ్ర కులాలకు అప్పగించారని విమర్శించారు.

జగన్​ మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని మండిపడ్డారు. అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప.. బీసీలకు అదనంగా జగన్‌ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. 140బీసీ కులాలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 16పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా ముగ్గురికే ఇచ్చారని విమర్శించారు.

విశ్వవిద్యాలయ వీసీలు, ప్రభుత్వ సలహాదారుల్లో ఏ కులం వారు ఎక్కువ ఉన్నారో చర్చించేందుకు జగన్‌ రెడ్డి సిద్ధమా అని సవాల్‌ చేశారు. బీసీలను వెతుక్కుంటూ వచ్చి వారికి పదవులు ఇచ్చే బాధ్యత తనదని స్పష్టంచేశారు. 54బీసీ సాధికారి కమిటీలు ఊరూరు తిరిగి మీకేం కావాలో నివేదిక తయారు చేయాలని..వాటిని అమలు చేసి బీసీల రుణం తీర్చుకునే బాధ్యత తనదని హామీఇచ్చారు.

మాయమాటలు చెప్పిన జగన్​.. బీసీలను నట్టేట ముంచారు

ఇవీ చదవండి:

Last Updated :Dec 1, 2022, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details