ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాడేరు గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన

By

Published : Jun 17, 2021, 10:21 PM IST

పాడేరు గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ గిరిజనుల సంక్షేమానికి కృషిచేస్తున్నారని ఎంపీ మాధవి ప్రశంసించారు.
పాడేరు గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన
పాడేరు గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఎంపీ.. గిరిజనుల కోసం సీఎం జగన్ చేస్తున్న కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఏజేన్సీలో పోడు భూములకు పట్టాలివ్వడం, గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య సలహా మండలి సభ్యులు నరసింహారావు, ఆర్డీవో లక్ష్మీ శివ జ్యోతి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details