ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. కోస్తా,రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు

By

Published : Jan 28, 2023, 7:52 AM IST

Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయో మూడు రోజుల్లో కోస్తా, సీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికార్లు సూచించారు.

వాతావరణ శాఖ
వాతావరణ శాఖ

Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 31వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికి శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఈ నెల 30 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details