ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మహిళలపై హత్యాయత్నం.. పోలీసులు పట్టించుకోరా..?'

By

Published : Nov 7, 2022, 7:58 PM IST

Nara Lokesh: శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో తల్లీకూతుళ్లపై మట్టి పోసిన ఘటనపై తెదేపా నేత నారా లోకేశ్​ స్పందించారు. వైకాపా నేతలు పట్టపగలు మహిళలను సజీవ సమాధి చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడంపై మండిపడ్డారు.

Nara Lokesh
నారా లోకేశ్​

Nara Lokesh: వైకాపా అధినేత జగన్ రెడ్డి బాబాయ్​ని చంపిస్తే.. ఆ పార్టీ నేతలు పట్టపగలు నడివీధిలో మహిళల్ని సజీవ సమాధి చేసే ప్రయత్నాలు చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో తమ ఇంటి స్థలం కబ్జా కాకుండా కొట్రదాలమ్మ, మజ్జి సావిత్రి అడ్డుపడగా.. వైకాపా నేతలైన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్​ రావులు... ట్రాక్టర్ గ్రావెల్​ను మహిళలపై వేయించి చంపాలని చూడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాపాడాలని మహిళలు రోదిస్తుంటే.. చావండి అంటూ పైశాచికత్వం ప్రదర్శించడం.. జగన్ రెడ్డి జంగిల్ రాజ్​కు నిదర్శనమని దుయ్యబట్టారు. దాయాదులైన మహిళల పట్ల పశువుల కంటే ఘోరంగా ప్రవర్తించిన వైకాపా నేతలు.. మంత్రి అనుచరులు కావడంతో పోలీసులు ఈ దాష్టీకంపై స్పందించడం లేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details