YSRCP MLAs Joined TDP Under Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. అనంతరం టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hundreds of YCP Workers Joined TDP:టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో శుక్రవారం భారీగా చేరికలు జరిగాయి. ప్రధానంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో ఎన్టీఆర్ భవన్లో సందడి నెలకొంది.
ఏపీలో మార్పు మొదలైంది - జగన్ 150 మందిని మార్చినా వచ్చే ఎన్నికల్లో గెలవలేరు : చంద్రబాబు