ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"భాషా పండితుల పోస్టుల తొలగింపు.. వృత్తిని అవమానించడమే.. ఆందోళనకు సిద్ధం"

By

Published : Apr 9, 2023, 9:44 PM IST

Updated : Apr 10, 2023, 6:23 AM IST

Language Teachers Association Meeting: భాషా ఉపాద్యాయులకు పదోన్నతి కల్పించడం వల్ల ప్రభుత్వానికి ఏ మాత్రం ఆర్థిక భారం లేకపోయినా ప్రభుత్వం వారికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని.. విజయవాడలోని రాష్ట్ర భాషా ఉపాధ్యాయుల సంస్థ కార్యవర్గ సమావేశంలో.. భాషా పండితులు చర్చించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాథమికోఉన్నత పాఠశాలల్లో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Language Teachers Association Meeting
Language Teachers Association Meeting

Language Teachers Association Meeting: భాషా ఉపాద్యాయులకు పదోన్నతి కల్పించడం వల్ల ప్రభుత్వానికి ఏ మాత్రం ఆర్థిక భారం లేకపోయినా ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని.. విజయవాడలోని రాష్ట్ర భాషా ఉపాధ్యాయుల సంస్థ కార్యవర్గ సమావేశంలో భాషా పండితులు అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భాషా పండితులంతా నల్లరిబ్బన్లతో నిరసన తెలపాలని సమావేశంలో తీర్మానించారు. జీతం ఇతర ఉపాధ్యాయులతో సమానంగా ఇస్తున్నా.. కేడర్ విషయంలో సమాన గౌరవం లభించడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తించే వారమని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వృత్తిని అవమానించడమే..ఉపాధాయ అర్హత పరీక్ష మొదటి పేపర్ తాము రాయనందుకు తమను.. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించడం కుదరదని భాషా పండితులు ఆవేదన చెందుతున్నారు. తమని భాషా పండితులుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల్లో తమకు ఐదు సార్లు వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా పండితులు అన్న పోస్టుని తొలగించడం తాము చేస్తున్న వృత్తిని అవమానించడమేనని అసహనం వ్యక్తం చేశారు. తమకి తక్షణమే పదోన్నతులు కల్పించాలని లేకపోతే తమకు తీరని అన్యాయం చేసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1134 మంది భాషా పండితులు ఉన్నారని వారి అభిప్రాయాలను గౌరవించి ప్రభుత్వం పోస్టులు తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు.

గుర్తింపు ఇచ్చేవరకు పోరాడుతాము..ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చిన మలిదశ ఉద్యోగుల ఉద్యమంలో తాము పాల్గొంటామని భాషా పండితులు తెలిపారు. కొన్ని ఉద్యోగ సంఘాల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం జీవో నెంబర్ 91ని రద్దు చేసిందని తెలిపారు. జీవో నెంబర్ 77తో భాషా పండితులకి తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఇతర ఉపాధ్యాయులతో వేతనాలు పొందుతున్నా.. సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని తెలిపారు. సీపీఎస్​పీఆర్సీ వంటి సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని భాషా పండితులు డిమాండ్ చేశారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి కోరారు. ఉన్నత పాఠశాలల్లో భాషా పండితులుగా గుర్తింపు ఇచ్చేవరకు పోరాడుతామన్నారు.

జీవో నెంబర్ 77 రద్దు చేయాలి..భాషా ఉపాధ్యాయుల పదోన్నతుల్లో సమస్యలు సృష్టిస్తున్న జీవో నెంబర్ 77 రద్దు చేయాలని భాషా ఉపాధ్యాయుల సంస్థ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. తాము ఏపీ జేఏసీ అమరావతి సంఘానికి అనుబంధంగా ఉన్నామని భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని భాషా పండితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకి పదోన్నతి కల్పించి ఇతర ఉపాధ్యాయులతో సమానంగా గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 10, 2023, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details