ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆదోని 3వ పట్టణ సీఐ, ఎస్సై సస్పెన్షన్​.. ఎందుకంటే..!

By

Published : Nov 23, 2022, 7:51 PM IST

అదోని పోలీస్ స్టేషన్
అదోని పోలీస్ స్టేషన్

Suspend: కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ మూడో పట్టణ సీఐ చంద్రబాబు, ఎస్సై పీరయ్యను సస్పెండ్ చేశారు. గత ఏడాది వీరిద్దరూ వేర్వేరు కేసులను అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినందుకు అధికారులు సస్పెండ్ చేశారు.

Suspend: కర్నూలు జిల్లా ఆదోని పట్టణ మూడో పట్టణ సీఐ చంద్రబాబు, ఎస్సై పీరయ్యను కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ సస్పెండ్ చేశారు. గత ఏడాది వీరిద్దరూ వేర్వేరు కేసులను అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినందుకు సస్పెండ్ చేశారు. గత ఏడాది 2020లో బ్రాహ్మణకొట్కూరు ఎస్సైగా ఉన్నప్పుడు దామగట్ల చెందిన మాసుంవలి హత్య కేసును.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినందుకు సీఐ చంద్రబాబును సస్పెండ్ చేయగా,.. 2020 ఏడాదిలో శ్రీశైలం ఎస్సైగా పనిచేస్తున్న పీరయ్య సున్నిపెంట వేద పాఠశాలలో.. గురువు వేధింపులకు విద్యార్థి మదుకుమార్ శర్మ మృతి చెందాడు. దీన్ని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినందుకు ఎస్సై పీరయ్యను సస్పెండ్ చేశారు. రెండు కేసులను విచారణ చేసి హత్య కేసులను.. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేయటంతో వారిద్దరిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆదోనిలో విధులు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details