ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆదోనిలో వింత శిశువు జననం

By

Published : Jun 7, 2021, 9:21 AM IST

కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వింత శిశువు పుట్టింది. చర్మం మొత్తం పిగిలిపోయి.. చిన్నారి జన్మించింది. జన్యు లోపం కారణంగా లక్షల్లో ఒకరు ఇలా పుడతారని వైద్యులు తెలిపారు.

strange baby
వింత శిశువు

కర్నూలు జిల్లా ఆదోని మహిళ,పిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో వింత శిశువు పుట్టింది. చర్మం మొత్తం పిగిలిపోయి వింత రూపంతో జన్మించింది. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామనికి చెందిన గంగాధర్,రాధ దంపతుల మూడవ సంతానం ఈ చిన్నారి.

గత ఏడాది కూడా ఆమెకు.. ఇలా ఓ పాప పుట్టి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. జన్యు లోపం వల్ల లక్షల్లో ఒకరికి ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details