ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENT: కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి

By

Published : Sep 27, 2021, 7:16 AM IST

Updated : Sep 27, 2021, 8:38 AM IST

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/27-September-2021/13183507_byke.png

07:13 September 27

accident in vijayawada

విజయవాడ శివారులో జరిగిన రోడ్డు  ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కండ్రిగ - పాతపాడు రహదారిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు వాంబేకాలనీ వాసులుగా తెలుస్తోంది. 

కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో..

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి జాతీయ రహదారిపై గన్నవరం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించిగా మరో యువకుడికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గుంటూరు జిల్లా కల్లూరుకి చెందిన సాయికుమార్​గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆత్కూరు ఎస్సై జీ. శ్రీనివాసరావు తెలిపారు. 

ఇదీ చదవండి:Bus Accident: బాదంపూడి వై-జంక్షన్‌ వద్ద బస్సు బోల్తా.. బస్సులో 40 మంది ప్రయాణికులు

Last Updated :Sep 27, 2021, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details