ETV Bharat / state

కాపులను మోసం చేసిన జగన్ - టీడీపీ అమలు చేసిన పథకాలూ ఎత్తివేత - YS Jagan Cheated Kapu Community

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 10:16 AM IST

YS_Jagan_Cheated_Kapu_Community
YS_Jagan_Cheated_Kapu_Community

YS Jagan Cheated Kapu Community: మాటల గారడీలోనే కాదు అంకెల గారడీలోనూ జగన్‌ మోహన్ రెడ్డిని మించిన వారుండరు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం కాపులకు జగన్ ఇచ్చిన హామీ, దానిని అమలు చేసిన తీరు. కాపు కాస్తానని చెప్పి కాటు వేసిన ఘనుడు జగన్‌. కాపు కార్పొరేషన్‌కు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని గత ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ ఇచ్చిన హామీ ఇదొక్కటే. నిజంగా కాపుల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ఒక్క హామీని అయినా సక్రమంగా అమలు చేయాలి కదా? కానీ అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు ఊసే లేదు.

YS Jagan Cheated Kapu Community: దగా, వంచన, మోసం, ఇలా ఏ పేరు పెట్టినా జగన్‌ మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ, ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. కాపుల విషయంలో అయితే మరీ ఘోరం. అయిదేళ్లలో ఎదిగేందుకు ఏ చిన్న అవకాశమూ ఇవ్వలేదు. అంతటితోనే ఆగలేదు. కాపు కాసేందుకు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పాతరేశారు. చివరికి నిరుపేదలకు ఉపయోగపడే కాపు భవనాలపైనా కక్షకట్టారు. టీడీపీ ప్రభుత్వం కట్టిందనే అక్కసుతో నిర్మాణాల పూర్తికి నిధులు కేటాయించకుండా ఎక్కడికక్కడ వదిలేశారు.

స్కిల్ ట్రైనింగ్ అందితే కాపు యువత ఎక్కడ బాగుపడిపోతారోనని దానికీ తిలోదకాలిచ్చారు. ఇదేకాదు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో టీడీపీ ప్రభుత్వం కాపులకు అమలు చేసిన 5 శాతం రిజర్వేషన్లనూ రద్దు చేశారు. ఇన్ని మోసాలు జగన్​పై కాపుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఓట్లాటకు తెరతీసి ‘కాపు నేస్తం’ ప్రకటించారు. అంటే, ఇది కూడా మనస్ఫూర్తిగా అమలు చేసింది కాదు. అందులోనూ నిబంధనల కొర్రీలు వేశారు. అయిదేళ్లలో ఆ పథకం కింద ఖర్చు చేసింది 2 వేల కోట్ల రూపాయలే. అధికారంలోకి వస్తే అయిదేళ్లలో 10 వేల కోట్ల రూపాయలు కేవలం కాపుల అభివృద్ధికే ఖర్చు చేస్తానని చెప్పి ఆయన చేసిన దగా ఇది.

రూ.50 వేలు ఇచ్చి రూ.3.5 లక్షలు లాగేసి - వాహనమిత్ర లబ్ధిదారులకు జగన్​ సర్కార్​ టోపీ - ysr vahana mitra scheme

టీడీపీ ప్రభుత్వంలో 1,441 కోట్ల రూపాయల రుణాలు: ఏ వర్గమైనా పేదరికం నుంచి బయటపడటానికి ఉపాధి కల్పనే కీలకం. ఉపాధి అవకాశాలు కల్పించడం లేదంటే, వారి ఎదుగుదలకు అడ్డుతగులుతున్నట్టే. జగన్‌ సీఎం అయ్యాక కాపులకు ఇదే చేశారు. టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాలతోపాటు కాపుల్లోని నిరుపేదలూ ముందుకు వెళ్లాలని వారికోసం కార్పొరేషన్‌ పెట్టింది. అందరికీ వర్తించే పథకాలను కాపులకు అమలు చేస్తూనే, 2014 నుంచి 19 మధ్య కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యేకంగా 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో కాపులకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రాయితీతో రుణాలు మంజూరు చేసింది.

అదనంగా బ్యాంకులతో మాట్లాడించి రుణాలు అందించింది. ఇలా 2.11 లక్షల మందికి 1,441.75 కోట్ల రూపాయల మేర రాయితీ రుణాలను అందించారు. వైఎస్సార్సీపీ హయాంలోనూ ఈ పథకం కొనసాగి ఉంటే మరెందరికో మేలు జరిగేది. కానీ రాయితీ రుణాల్ని ఎత్తేశారు జగన్‌. పైకి మాత్రం కాపులకు చాలా మేలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన ఇచ్చిందేంటో తెలుసా? అందరికీ వర్తించే పింఛన్లు, ఉపకారవేతనాలు, ఇతర పథకాలు. వాటిలో ఉండే కాపు సామాజికవర్గం వారి సంఖ్యను పక్కకు తీసి, పెద్ద సంఖ్యగా చూపించారు. జగన్‌కు మాత్రమే చేతనయ్యే అంకెల గారడీ ఇది.

చేసింది దగా-దాన్నే సాయమని ప్రచారం! సమాన పనికి సమాన వేతనమంటూ జగన్ మోసం - Jagan Cheat Outsourcing Employees

‘విదేశీ విద్య’ అమలుకు మనసొప్పలేదు: తమ బిడ్డల్ని లక్షల రూపాయలు పెట్టి గొప్ప చదువులు చదివించలేక ఇబ్బందిపడే తల్లిదండ్రులకు టీడీపీ అమలు చేసిన ‘విదేశీ విద్య’ పథకం గొప్ప ఊరటగా నిలిచింది. కాపులకు దీన్ని అమలు చేసేందుకూ జగన్‌కు మనసొప్పలేదు. అధికారం చేపట్టిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈ పథకం అమలు ఊసే ఎత్తలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని వారిని మరోసారి మభ్యపెట్టేందుకు ఎత్తుగడ వేశారు. సాయాన్ని పెంచి అమలు చేసినట్టు పైకి చూపించినా, అమల్లోకి వచ్చేసరికి మాత్రం కుయుక్తులు పన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకం కింద 1,892 మంది విద్యార్థులను విదేశాలకు పంపింది.

అందుకు 207 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన విధానాన్ని పరిశీలిస్తే, తొలుత 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తేనే ఆర్థిక సాయాన్ని అందిస్తామని మోకాలొడ్డింది. ఆ తర్వాత నిబంధనల్ని మరింత కఠినతరం చేసి సబ్జెక్ట్‌ల అంశాన్ని తెరమీదకు తెచ్చి, వాటిలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాయాల్లో సీటు సంపాదిస్తేనే సాయాన్ని అందిస్తామనేలా అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో మరోసారి సవరణలు చేశారు. జగన్‌ అయిదేళ్ల పాలనలో ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులు 250 మంది కూడా లేరు. ఇంతకంటే వంచన ఎక్కడైనా ఉంటుందా?

సొంతింటి కలల్ని కూల్చేసిన జగన్‌- అయిదేళ్లలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం - cm ys jagan cheating poor people

నైపుణ్య శిక్షణనీ ఆపేశారు: ప్రతిభ ఉన్నా సరైన స్కిల్స్ లేక వెనుకబడే యువత ఎంతో మంది ఉన్నారు. నైపుణ్య శిక్షణ అందిస్తే అలాంటివారి కెరీర్‌కు తిరుగుండదు. టీడీపీ ప్రభుత్వం కాపుల పట్ల ఇదే ఆలోచన చేసింది. వారికి ఆసక్తి ఉన్న రంగంలో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంది. ఎక్కడికక్కడ ప్రత్యేక నోటిఫికేషన్లు ఇచ్చి వారిని ప్రోత్సాహించింది. ఇలా 2014 నుంచి 19 మధ్య కాలంలో 40 వేల మంది కాపు యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది. ఇందుకుగాను 28.73 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

సూక్ష్మ రంగాల్లో స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ‘విద్యోన్నతి’ పథకం కింద సివిల్స్‌ పరీక్ష రాసేవారికి ఫ్రీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని తెచ్చింది. దిల్లీ, ముంబయి, చెన్నై, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌ ఇలా అభ్యర్థులు కోరుకున్న చోట ట్రైనింగ్ ఇప్పించింది. ఆ ఖర్చు మొత్తాన్ని అప్పటి ప్రభుత్వమే భరించింది. ఒక్కొక్క విద్యార్థిపై లక్ష నుంచి 1.50 లక్షల రూపాయలు వరకు ఖర్చు చేసింది.

టీడీపీ హయాంలో కాపులకు రిజర్వేషన్‌: దశాబ్దాలుగా నలిగిన కాపుల రిజర్వేషన్‌ కలకు టీడీపీ ప్రభుత్వం దారి చూపింది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఇచ్చే 10 శాతంలో 5 శాతం రిజర్వేషన్లను వారికే కల్పించింది. దీన్ని కూడా జగన్‌ అధికారంలోకి రాగానే రద్దు చేశారు. ఆయన మంత్రివర్గంలో ఉండే కాపు వర్గానికి చెందిన సహచరులుగానీ, ఇతర వైఎస్సార్సీపీ నేతలుగానీ ఇప్పటివరకు దీనిపై జగన్‌ను ప్రశ్నించిన దాఖలాలే లేవు.

సీఎం జగన్​ 'బాటా రేట్' వ్యూహం - 99 శాతం హామీల వెనక అసలు కథ ఏంటంటే !

కాపు భవన నిర్మాణాలపై కూడా: పేద, మధ్య తరగతికి చెందినవారు ఏదైనా శుభకార్యాన్ని చేసుకోవాలంటే చిన్న ఫంక్షన్‌ హాలైనా రోజుకు 20 వేల రూపాయలకు పైనే చెల్లించాల్సిన దుస్థితి. అదే కాపు భవనాల్లో అయితే ఆ సామాజిక వర్గానికి పూర్తిగా ఫ్రీ. అందుకే భవనాల ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇక్కడ శుభకార్యాలే కాకుండా సామాజిక వర్గ మీటింగ్​లు, సదస్సులు, ఇతర ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో 145.15 కోట్ల రూపాయలతో 500 మినీ కాపు భవనాల నిర్మాణం చేపట్టింది. వీటిని చూసి జగన్‌కు కన్నుకుట్టినట్టుంది. అందుకే చాలా చోట్ల వాటి నిర్మాణాలను మధ్యలోనే వదిలేశారు. వాటికి టీడీపీ ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని వెనక్కి తీసుకున్నారు. దీనిపై కాపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో వైఎస్సార్సీపీ నేతల సిఫార్సుల మేరకు ఎన్నికల వేళ కొన్ని చోట్ల పనులు కొనసాగిస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం కాపు యువతకు రుణాలివ్వడం వరకే ఆగిపోకుండా, ఏ ఆదరువు లేని వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఆసక్తి ఉన్న వారికి డ్రైవింగ్‌ శిక్షణ ఇప్పించింది. ఖరీదైన ఎస్‌యూవీల కొనుగోళ్లనూ ప్రోత్సాహించింది. మొత్తంగా 284 మందికి 21.30 కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం అందించింది. వీటితో లబ్ధిదారులు నెలకు 30 వేల నుంచి 40 వేల రూపాయల వరకు సంపాదించేవారు. పేదరికం నుంచి కుటుంబాన్ని బయటపడేసేందుకు ఇంతకంటే ఏం కావాలి? కానీ జగన్‌ ప్రభుత్వం ఇలాంటి ఆలోచనే చేయలేదు.

జాబ్ క్యాలెండర్​ను మడతెట్టేసిన 'జగన్ మామ' - నిరుద్యోగులతో బంతాట !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.