ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Durga temple: ఇంద్రకీలాద్రిపై నిత్య ఆర్జిత సేవలు.. పరిమితంగా భక్తులకు అనుమతి!

By

Published : Jul 6, 2021, 6:00 PM IST

కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో దుర్గామల్లేశ్వర స్వామివార్ల (vijayawada temple)ఆర్జిత సేవలకు భక్తులకు(pilgrims) అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 40శాతం మంది భక్తులు అమ్మవారి సేవల్లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు(paila somi naidu) తెలిపారు.

vijayawada durga temple
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పరిధిలో... బుధవారం నుంచి అన్ని రకాల నిత్య ఆర్జిత సేవలకు 40 శాతం పరిమితితో భక్తులను అనుమతిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు.

దేవాదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యక్ష సేవలు బుక్ చేసుకునే అవకాశం లేనందున, దేవస్థాన ఆర్జిత సేవాకౌంటర్ నందు భక్తులు టిక్కెట్లు పొందాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details