ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'క్లిష్ట పరిస్థితులను చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొనేవారు'

By

Published : Apr 20, 2020, 2:10 PM IST

తెదేపా హయాంలో పాలన అలవోకగా సాగేదని.. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొనేవారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలో ప్రజలకు ఆయన పండ్లు పంపిణీ చేశారు.

mp kesineni nani distribute fruits on chandrababu birthday at reddygudem krishna district
పండ్లు పంచుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో.. స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో పాలన అలవోకగా సాగేదని అన్నారు. క్లిష్ట పరిస్థితులను సైతం చంద్రబాబు మొక్కవోని దీక్షతో ఎదుర్కొనేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అవగాహనలేమితో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్ధతతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోందన్నారు. లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ, తదితరులు పాల్గొన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details