ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Aug 29, 2021, 4:58 PM IST

ప్రధాన వార్తలు @ 5 PM

ప్రధాన వార్తలు @5PM
ప్రధాన వార్తలు @5PM

  • తరతరాలుగా సజీవంగా తెలుగు సంస్కృతి: గవర్నర్ బిశ్వభూషణ్

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలకు గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా తెలుగు సంస్కృతి సజీవంగా ఉందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • పలుకు పరవశం.. మాట మాధుర్యం.. ఇదీ తెలుగు గొప్పతనం!

దేశ భాషలందు తెలుగు లెస్సా.. ఇది శ్రీకృష్ణదేవరాయలు పలికిన మాటలు. కానీ నేడు తెలుగు భాష కాలప్రవాహంలో మిణుకు మిణుకు మంటోంది. అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పరభాష ప్రత్యామ్నాయంగా మారడంతో.. మాతృభాష తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. మాతృభాషను బతికించాలని.. భవిష్యత్‌ తరాలకు అందించాలని ఎంతోమంది తపిస్తున్నారు. తమవంతు శ్రమిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'కృష్ణా జలాలపై జగన్, మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు'

ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై తెదేపా నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతామన్న కర్ణాటక సీఎం వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • లక్ష గాజులతో నూకాలమ్మ ఆలయంలో ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ

విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి.. లక్ష గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక అవతారంలో అభయమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • మైనర్​కు కరోనా టీకా- పరిస్థితి ఆందోళనకరం!

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తప్పిదం జరిగిందని సమాచారం. మధ్యప్రదేశ్​లో ఓ మైనర్​కు కరోనా టీకా (minor vaccine) వేసినట్లు తెలుస్తోంది. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • అసెంబ్లీ వేదికగా పార్టీ నేతలకు సీఎం హెచ్చరిక

కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు.. పార్టీ అధినేతలపై ప్రశంసలు(sycophancy in politics) కురిపించటం ఏ పార్టీలోనైనా కనిపిస్తుంది. కానీ, అలాంటి వాటికి తమ పార్టీ దూరం అంటున్నారు ఓ ముఖ్యమంత్రి(Tamil Nadu CM). ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో(Tamil Nadu Assembly) పొగడ్తలతో సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • అంక్లేశ్వర్​ నుంచి కొవాగ్జిన్​ ఫస్ట్​ బ్యాచ్​ విడుదల

గుజరాత్​ అంక్లేశ్వర్​ ప్లాంట్​లో తయారైన కొవాగ్జిన్​ (Covaxin India) తొలి బ్యాచ్​ టీకా విడుదలైంది. కేంద్ర మంత్రి మన్​సుఖ్​ మాండవీయ.. ఈ మొదటి బ్యాచ్​ వ్యాక్సిన్​ డోసులను విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • స్పేస్​లోకి చీమలు, రొయ్యలు, ఐస్​క్రీమ్.. ఎందుకంటే?

ఐస్​క్రీమ్, అవకాడోలు, నిమ్మకాయలు... ఏంటి? ఇదేమైనా గ్రోసరీ లిస్ట్ అనుకుంటున్నారా? కాదండోయ్! అంతరిక్షంలోకి నాసా పంపిన వస్తువుల జాబితా. ఇవే కాదు చీమలను కూడా పంపించింది. స్పేస్ఎక్స్(spacex launch) వ్యోమనౌక వీటిని నింగిలోకి చేర్చింది. అసలు ఇవి అంతరిక్షంలోకి ఎందుకు పంపించారంటే? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • భవీనాకు గుజరాత్​ సర్కారు భారీ నజరానా

టోక్యో పారాలింపిక్స్​లో రజత పతకం సాధించిన టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి భవీనా బెన్​ పటేల్(Bhavina Patel news)​కు భారీ గిఫ్ట్​ ఇచ్చింది గుజరాత్​ ప్రభుత్వం. రూ. 3 కోట్లు నజరానా ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • చిరు 'గాడ్​ఫాదర్​'​లో విలన్​గా స్టార్​ నటుడు!

మోహన్​ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 'లూసిఫర్'​ రీమేక్ 'గాడ్​ఫాదర్​' ​లో(chiranjeevi lucifer remake) స్టార్​ నటుడు మాధవన్​ విలన్​ పాత్ర పోషించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details