ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అతని కోసం అందరిని వదిలేసుకుంది.. మోసపోయాక, ప్రాణాలే వదిలేసింది

By

Published : Oct 7, 2022, 8:31 PM IST

selfie suicide video: ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది.. అన్నీ తానే అనుకుని అయిన వాళ్లను వదులుకొని ప్రేమించిన వాడి కోసం వెళ్లిపోయింది. హాస్టల్లో ఉంటే అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికితే అతని మాట విని అక్కడ చేరింది. పాత విషయాలు గుర్తు చేసి ఆమెను చిత్రహింసలు చేసినా భరించింది. కానీ చివరికి పెళ్లి చేసుకోను అని చెప్పడంతో తన బాధను ఎవరితో చెప్పాలో తెలియక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలోని బెల్లంపల్లి పట్టణంలో చోటుచేసుకుంది.

suicide
suicide

selfie suicide video: సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం షంషీర్​ నగర్​లో జరిగింది. యువతి ఆత్మహత్యకు పాల్పడటం.. చుట్టు పక్కల గ్రామాల్లో కలకలం సృష్టించింది. సెల్ఫీ తీసుకుంటూ యువతి చెప్పిన మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తాయి.

బెల్లంపల్లి పట్టణం షంషీర్​ నగర్​కు చెందిన తేజశ్రీ, నెన్నెల మండలం లంబడితాండ గ్రామానికి చెందిన ధరావత్​ రాజ్​ కుమార్​ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి గత కొన్ని నెలలుగా హాస్టల్​లో ఉంటుంది. ఇంట్లో వాళ్ల మాటను పట్టించుకోకుండా ప్రేమికుడి మాటలు నమ్మింది. చివరికి అతడు ఆ యువతిపై నిందలు మోపి పెళ్లికి నిరాకరించడంతో ఏమి చేయాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఈ మొత్తం విషయాన్ని సెల్​ఫోన్​లో సెల్ఫీ వీడియో తీసింది.

ధరావత్​ రాజ్​కుమార్​ ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ పురుగుల మందు తాగింది. బెల్లంపల్లి నుంచి ఆటోలో లంబతాండకు బయలుదేరి, నెన్నెల టీ రోడ్డు వద్దకు రాగానే తనకు కళ్లు తిరుగుతున్నాయని యువతి ఆటో డ్రైవర్​తో చెప్పింది. అతను ఆమెను స్థానిక పీహెచ్​సీకి తరలించాడు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ఆసుపత్రి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాజ్​ కుమార్​ వల్లనే తన కుమార్తె ప్రాణం తీసుకుందని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది.

suicide

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details