LIVE: అనంతపురంలో నారా లోకేశ్ శంఖారావం బహిరంగసభ- ప్రత్యక్షప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 10:40 AM IST
|Updated : Mar 11, 2024, 11:40 AM IST
Nara_Lokesh_Sankharavam_Sabha_at_Anantapur_Live
Nara Lokesh Sankharavam Sabha at Anantapur Live: రాయలసీమలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో విడత 'శంఖారావం' పర్యటనలు ప్రారంభం అయ్యాయి. గురువారం నారా లోకేశ్ హిందూపురం నుంచి 'శంఖారావం' ప్రారంభించారు. ప్రస్తుతం అనంతపురం శంఖారావం బహిరంగసభలో లోకేశ్ పాల్గొన్నారు. వైసీపీ హయాంలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మందిని హత్య చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. బీసీలకు రావాల్సిన రూ.25 వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 50 ఏళ్లు పైబడిన బీసీలకు ప్రతి నెలా 4 వేల రూపాయలు అందించబోతున్నామని తెలిపారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామన్న లోకేశ్, బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కాగా ప్రస్తుతం అనంతపురం శంఖారావం సభలో నారా లోకేశ్ ప్రత్యక్షప్రసారం మీ కోసం.
Last Updated :Mar 11, 2024, 11:40 AM IST