LIVE : తెలంగాణ భవన్ నుంచి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం
Published : Feb 21, 2024, 3:22 PM IST
|Updated : Feb 21, 2024, 3:29 PM IST
BRS Leader Niranjan Reddy on Jural Project LIVE : ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీ జరిగినన్ని రోజులు ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ప్రధానంగా మేడిగట్ట అంశం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్థం కోసం ప్రాజెక్టుల రూపు రేఖలు, ప్రణాళికలు మార్చస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తుంటే.. బీఆర్ఎస్ విధానాల వల్లే ఇప్పుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల భవితవ్యం అంధకారంలో పడిందని హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నాయి. ఈ డైలాగ్ వార్ రోజురోజుకూ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లోనూ ప్రాజెక్టుల అంశమే కీలకం కానుంది. గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీ విచారణ చేయిస్తామని ప్రకటించడం, దానికి సిద్ధమేనని బీఆర్ఎస్ ప్రకటనతో ఇది మరింత రసవత్తంగా మారింది. ఇదే అంశంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.