తెలంగాణ

telangana

LIVE : తెలంగాణ భవన్​లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం - Niranjan reddy live

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 12:07 PM IST

Updated : Apr 15, 2024, 12:21 PM IST

Niranjan Reddy Live : ప్రస్తుతం రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సరైన సమయంలో సాగు నీరు అందక చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. పలుచోట్ల పశువులకు మేతగా మారుతున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీరందించే ప్రయత్నాలు చేస్తున్నా, అవి పెట్టుబడి ఖర్చు పెరగడానికి తప్ప, పంటను కాపాడటానికి ఉపయోగపడటం లేదు. ఈ క్రమంలో ఈ కరవు పరిస్థితులకు కాంగ్రెస్​ ప్రభుత్వమై కారణమంటూ ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్​ఎస్​ పార్టీ రేవంత్​ సర్కార్​పై నిప్పులు చెరుగుతోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవని, ప్రస్తుత పరిస్థితులకు ప్రభుత్వ చేతగాని తనమే కారణమంటూ దుయ్యబడుతోంది. పంటలు దెబ్బతిన్న అన్నదాతలకు పరిహారం చెల్లించి, ఆదుకోవాలని డిమాండ్​ చేస్తోంది. ఇదే అంశంపై తాజాగా తెలంగాణ భవన్​లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాటు బీజేపీ సంకల్ప పత్ర మేనిఫెస్టో, మద్యం కేసులో కవిత సీబీఐ కస్టడీపైనా ఆయన మాట్లాడుతున్నారు.
Last Updated : Apr 15, 2024, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details