తెలంగాణ

telangana

LIVE : హనుమకొండలో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - BRS Leaders PC LIVE

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 11:34 AM IST

Updated : Mar 29, 2024, 11:44 AM IST

BRS
BRS Leaders Live :  వరంగల్ జిల్లాలో ఒక్కొక్కరుగా కారు దిగుతున్న బీఆర్ఎస్‌ నేతలు అధినాయకత్వానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్ హస్తం గూటికి చేరారు. పోను పోనంటూనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితిని వీడారు. తాజాగా కడియం శ్రీహరి సైతం అదే బాటలో పయనించడం ఓరుగల్లులో గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారనుంది.తాజాగా హనుమకొండలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుతున్నారు. వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య  గులాబీ పార్టీ తరఫు నుంచి పోటీ చేయలేనని ప్రకటించడంపై నేతలు స్పందిస్తున్నారు. అలాగే స్టేషన్‌ఘన్‌పూర్‌ గులాబీ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం కావడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌ అంశాన్ని రాజకీయం చేయడం తగదని అంటున్నారు.
Last Updated :Mar 29, 2024, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details