తెలంగాణ

telangana

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు దిల్లీ వెళ్లిన కేటీఆర్ - KTR Went to Delhi to Meet Kavita

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 3:13 PM IST

KTR went to Delhi
MLC Kavitha in CBI Investigation

KTR Went to Delhi to Meet Kavita : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఇవాళ సాయంత్రం కలవనున్నారు. దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత, ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

KTR Went to Delhi to Meet Kavita : సీబీఐ అదుపులో ఉన్న తన సోదరి, ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు బీఆర్​ఎస్​ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ దిల్లీకి బయల్దేరారు. కస్టడీలో ఉన్న కవితతో ఇవాళ సాయంత్రం కేటీఆర్​ భేటీ కానున్నారు. ప్రతి రోజు ఒక గంట పాటు కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.

కాగా, ప్రస్తుతం దిల్లీ సీబీఐ హెడ్ క్వార్టర్స్​లో కవిత ఉన్నారు. ఆమె సీబీఐ కస్టడీ రేపటితో ముగియనుంది. దిల్లీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్ట్​ అయి, ప్రస్తుతం సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారుల ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details