T20 World Cup 2024 Teamindia Squad :బీసీసీఐ సెలక్షన్ కమిటీ రాబోయే వరల్డ్ కప్ టీ20 సమరానికి ప్లేయర్లను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 30న ప్రకటించిన 15 మంది ప్లేయర్ల బృందంలో కొందరు కీలక ప్లేయర్లు చోటు దక్కించుకోలేకపోయారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు యథాస్థానాన్ని కొనసాగిస్తూ అలానే సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ వంటి ప్లేయర్లకు అవకాశం కల్పించారు. అయితే ప్రతిభావంతమైన కొంతమంది ప్లేయర్లను పక్కకుపెట్టడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ప్రస్తుతం ఎంచుకున్న జట్టుపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇంతకీ చోటు కోల్పోయిన వారు ఎవరంటే?
శుభ్మన్ గిల్ -వరల్డ్ కప్లో స్థానం కోసం ఎదురుచూసిన టీమ్ ఇండియా స్టార్, యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్కు నిరాశే ఎదురైంది. ప్రపంచ కప్ ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. గిల్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో మాత్రమే ఉన్నాడు. ఎవరైనా ప్లేయర్ గాయపడితేనే తప్ప అతడికే ఆడే అవకాశం రాకపోవచ్చు. గిల్ భారత్ తరఫున 14 టీ20ల్లో 147 స్ట్రైక్ రేట్తో 335 పరుగులు చేశాడు. 100 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3094 పరుగులు కొట్టాడు. అయితే అతడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ బ్యాట్తో అంతగా రాణించలేకపోవడమే వరల్డ్ కప్ టీ20 జట్టులో చోటు దక్కనివ్వకుండా చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రుతురాజ్ గైక్వాడ్ - చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ ఆరంభమైన నాటి నుంచి బ్యాటింగ్తో చక్కటి ప్రదర్శన కనబరిచాడు. సెంచరీలతో జట్టుకు స్కోరును బలపరుస్తున్న గైక్వాడ్ టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోకపోవడం షాకింగ్ అంశమే. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగానూ అతడు కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేసి 447 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్ - లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సీజన్లో అద్భుతంగానే రాణిస్తున్నాడు. కానీ గాయం కారణంగా అతడు కొంతకాలం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే అతడికి పోటీగా ఉన్న సంజూ శాంసన్కు చోటు దక్కింది.