తెలంగాణ

telangana

చెలరేగిన రోహిత్ సేన - 255 పరుగుల ఆధిక్యంలో టీమ్​ఇండియా

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 4:59 PM IST

Updated : Mar 8, 2024, 5:39 PM IST

India Vs England 5th Test : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీమ్ఇండియా 255 పరుగుల ఆధిక్యంలో ఉంది.

India Vs England 5th Test
India Vs England 5th Test

India Vs England 5th Test :ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీమ్ఇండియా 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 218 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 473/8 స్కోరుతో నిలిచింది. ఇంగ్లాండ్‌ స్పిన్నర్ షోయబ్‌ బషీర్ (4/170) నాలుగు వికెట్లు తీసినప్పటికీ, భారత జట్టును నియంత్రించలేకపోయాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కుల్‌దీప్‌ యాదవ్ (27*), బుమ్రా (19*) ఉన్నారు.

మ్యాచ్​ సాగిందిలా :
ఓవర్‌నైట్‌ 135/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియాకు మంచి ఇన్నింగ్స్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా భారీ లీడ్‌తో దూసుకెళ్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోర్ చేసింది. అంతకుముందు రోహిత్ శర్మ 154 బంతుల్లో సెంచరీ (103) అందుకున్నాడు. ఇక శుభ్‌మన్‌ గిల్ (110) కూడా శతకంతో చెలరేగిపోయాడు. అలా రెండో వికెట్‌ సమయానికి రోహిత్, గిల్ ఏకంగా 161 పరుగులు పార్ట్​నర్​షిప్​ జోడించారు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ చేతికి రోహిత్ చిక్కాడు. ఈ క్రమంలో క్లీన్‌ బౌల్డ్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు.

ఆ తర్వాత శుభ్​మన్​ గిల్‌ కూడా ఔటవ్వడం వల్ల టీమ్‌ఇండియా ఇబ్బందుల్లో పడినట్లు అనిపించింది. కానీ యంగ్ ప్లేయర్స్​ దేవదుత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధశతకాలతో రాణించి జట్టును గట్టెక్కించారు. అలా తొలి ఐదుగురు బ్యాటర్లు 50+ స్కోర్లు చేసి స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించారు.

ఇదిలాఉండగా పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్ (15), రవిచంద్రన్ అశ్విన్‌ (0)ను ఇంగ్లాండ్‌ బౌలర్లు వరుసగా ఔట్‌ చేశారు. అయితే వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ కావడం గమనార్హం. ఆ తర్వాత కుల్‌దీప్‌ యాదవ్ - జస్‌ప్రీత్ బుమ్రా క్రీజ్‌లో వచ్చినప్పటికీ అంతగా రాణించలేకపోయారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 218 రన్స్‌కే ఔటైంది.

'క్రికెటర్లలో అతడొక చెస్‌ ప్లేయర్‌గా అనిపిస్తాడు'- అశ్విన్​పై చెస్​ దిగ్గజం ప్రశంసలు

'రోహిత్ సవాళ్లను ఎంజాయ్​ చేస్తాడు- అతడి కెప్టెన్సీ భేష్'

Last Updated : Mar 8, 2024, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details