తెలంగాణ

telangana

ఎల్​ఆర్​ఎస్​లపై త్వరలోనే కీలక నిర్ణయం : భట్టి విక్రమార్క

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 10:26 PM IST

Naredco Team Meet Deputy CM Bhatti Vikramarka : రాష్ట్రంలోని పెండింగ్​లో ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్లపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో నరెడ్కో బృందం భట్టితో సమావేశమైంది. ఎల్​ఆర్ఎస్​ దరఖాస్తుల సమస్యలు తీరిస్తే పెద్ద ఎత్తున సర్కారుకు ఆదాయం వస్తుందని ఈ టీమ్​ సూచించింది.

Bhatti Vikramarka on LRS Applications
Naredco Team Meet Deputy CM Bhatti Vikramarka

Naredco Team Meet Deputy CM Bhatti Vikramarka: పెండింగులో ఉన్న ఎల్ఆర్ఎస్(లే అవుట్​ రెగ్యులేజేషన్​ స్కీమ్​) దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి నరెడ్కో తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం ఉపముఖ్యమంత్రిని కలిసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రానికి ఆదాయాన్ని అందించే వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టమని ఉపముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

How to Check TS LRS Application Status 2023: తెలంగాణ LRS అప్లికేషన్​ స్టేటస్​.. ఇలా తెలుసుకోండి!

Bhatti Vikramarka on LRS Applications: స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని భట్టి హామీ ఇచ్చారు. థేమ్స్ నది తరహాలో మూసీ పరీవాహకం అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందని ఉపముఖ్యమంత్రి(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. ధరణిపై సూచనలు, సలహాలను ఇస్తే కమిటీకి పంపించి పరిశీలిస్తామని తెలిపారు. భవన నిర్మాణ అనుమతులకు 10 శాతం మార్ట్​గేజ్ విధానాన్ని ఎత్తి వేయాలని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని, జీఓ 50ని ఎత్తివేయాలని నరెడ్​కో బృందం ఉపముఖ్యమంత్రికి సూచించింది.

land Regularization : భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విధివిధానాల్లో మార్పులు

Naredco Team Suggestions to Bhatti Vikramarka : లక్షలాది ఎల్​ఆర్​ఎస్ దరఖాస్తులను(Govt Dessicion on LRS Applications) పరిష్కరిస్తే పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని నరెడ్కో బృందం తెలిపింది. టీఎస్ బీపాస్ కింద రంగారెడ్డి జిల్లాలో సుమారు రెండేళ్లుగా దరఖాస్తులు పెండింగ్​లో ఉండటంతో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. పర్యావరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు యూనిట్ ధర రూ.9 నుంచి రూ.14లకు పెంచారని గుర్తు చేశారు. ఆ ధర కాస్త తగ్గించాలని నరెడ్కో బృందం ఉపముఖ్యమంత్రిని కోరింది.

LRS Applications in Telangana : రాష్ట్రంలో అనధికార లే-అవుట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు గత ప్రభుత్వం ఎల్​ఆర్ఎస్​ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు గతంలో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో ఈ దరఖాస్తులు దాదాపుగా 20 లక్షలకు పైగా వచ్చాయి. దీనికి రిజిస్ట్రేషన్​ ఫీజును రూ.1000లు, లే-అవుట్​ అప్లికేషన్​ ఫీజును రూ.10,000లుగా గత ప్రభుత్వం ఖరారు చేసింది. వంద గజాలలోపు ఉన్న ప్లాట్లకు గజానికి రూ.200 చొప్పున, 100-300 గజాలు ఉన్న వాటికి ఒక్కో గజానికి రూ.400 చొప్పన రెగ్యులైజేషన్​ ఫీజు చెల్లించారు.

Illegal Registrations: అక్రమ రిజిస్ట్రేషన్లు.. అనధికార వసూళ్లు!!

ABOUT THE AUTHOR

...view details