తెలంగాణ

telangana

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చేసింది - నేటి నుంచే నామినేషన్లు షురూ - Telangana Graduate MLC Elections

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 12:12 PM IST

Updated : May 2, 2024, 12:23 PM IST

Telangana Graduates MLC Bypoll Notification 2024 : ఈ నెల 27న జరగనున్న నల్గొండ - ఖమ్మం - వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నేటి నుంచి నల్గొండ కలెక్టరేట్‌లో తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

Graduates MLC Bypoll
Telangana Graduates MLC Bypoll Notification 2024

Nalgonda - Khammam - Warangal Graduate MLC By Election 2024 : నల్గొండ - ఖమ్మం - వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్గొండ కలెక్టరేట్‌లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. నేడు నోటిఫికేషన్​ విడుదల కావడంతో ఈరోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. నల్గొండ కలెక్టర్‌ హరిచందన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్‌ను దాఖలు చేసే అభ్యర్థులు సెలవు దినాలు మినహా, మిగతా అన్ని ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 10న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 27న పోలింగ్‌, జూన్‌ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార కాంగ్రెస్‌ తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ కుమార్‌ను ప్రకటించింది. బీఆర్​ఎస్, బీజేపీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి.

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - షెడ్యూలు విడుదల - Telangana Graduate MLC Elections

2027 వరకు పదవీ కాలం : 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. దాంతో డిసెంబర్ 9న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పల్లా రిజైన్​ చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా, మే 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, జూన్ 5న ఓట్లు లెక్కించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

పట్టభద్రుల ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు సిద్ధమైన బీజేపీ - ఆ ముగ్గురిలో ఛాన్స్ కొట్టేసేది ఎవరో? - Graduates MLC Bypoll In Telangana

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు - ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే - Nominations Deadline Ended

Last Updated : May 2, 2024, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details