తెలంగాణ

telangana

కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది : బండి సంజయ్‌

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 3:59 PM IST

BJP MP Bandi Sanjay Fires on KCR : కరీంనగర్‌ కదనభేరి సభలో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాటలకు బండి సంజయ్‌ స్పందించారు. కరీంనగర్‌కు స్మార్ట్‌ సిటీ హోదా తెచ్చాననే గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ మాటలపై తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసి అధికారం చేపట్టిందన్నారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీలను ప్రజలు విశ్వసించరని గ్రహించి, మరోసారి కమలం, గులాబీ పార్టీలు ఒక్కటే అని ప్రచారం ప్రారంభించిదన్నారు.

Bandi Sanjay Comments on Congress,BRS
BJP MP Bandi Sanjay Fires on KCR

BJP MP Bandi Sanjay Fires on KCR :కరీంనగర్‌ కదనభేరి సభలో బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్‌ బదులిచ్చారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదా ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ(BJP) అని ఉద్ఘాటించారు. కేంద్రం స్మార్ట్ సిటీ ఇస్తే తామే తెచ్చామని కేసీఆర్‌ చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, కేసీఆర్ మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు.

నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రం నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించిందని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం మూడు సార్లు లేఖలు రాసినా నాటి కేసీఆర్‌ సర్కారు(BRS Party) స్పందించలేదని బండి తెలిపారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెచ్చానని కారు పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ చెప్పుకుంటున్నారని, తీవ్రంగా మండిపడ్డారు.

తెలంగాణలో మరింత కష్టపడితే 15 స్థానాల్లో గెలుస్తాం : అమిత్ ​షా

"బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ పదాన్ని తొలగించిన తరవాత, మన రాష్ట్రంతో గులాబీ పార్టీ తెగదింపులు చేసుకున్నట్లే. కేసీఆర్‌, ఆ పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. పది సంవత్సరాలు రాజ్యమేలి, కనీసం ప్రజలు చీదరించుకున్న తరువాత మార్పు వస్తుందని తెలంగాణ సమాజం భావించింది. భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని మాట్లాడుతున్నారు. అసలు ఆ పని చేసింది ఎవరు కేసీఆర్‌నే."-బండి సంజయ్, కరీంనగర్‌ ఎంపీ

Bandi Sanjay Comments on Congress,BRS : అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసి అధికారం చేపట్టిందన్నారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీలను ప్రజలు విశ్వసించరని గ్రహించి, మరోసారి కమలం, గులాబీ పార్టీలు ఒక్కటే అని ప్రచారం ప్రారంభించిదన్నారు. కాళేశ్వరం(Kaleshwaram Project) విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.

కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఈ కాళేశ్వరం అన్నీ తర్వాతనే అని దుయ్యబట్టారు. సహారా, ఈఎస్‌ఐ కేసుల్లో చేసిన అవినీతిపై కేసీఆర్‌ ఇంతవరకు స్పందించలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ వచ్చి రిపోర్ట్‌ ఇస్తే, మేడిగడ్డ కుంగుబాటు ఇష్యూ చిన్నదిగా అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు. ఏమిలేని కేసీఆర్‌ లక్షాధికారి ఏవిధంగా అయ్యారని ప్రశ్నించిన బండి, అవినీతి ఆస్తులన్నీ జప్తు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి(Congress Govt) డిమాండ్ చేశారు.

కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది : బండి సంజయ్‌

లోక్​సభ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ నజర్​- అభ్యర్థుల రెండో లిస్ట్ రెడీ!

కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయం: అమిత్‌ షా

ABOUT THE AUTHOR

...view details