ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ ది రాక్షస పాలన- ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల అప్పుల భారం మోపారు: పురందేశ్వరి - Purandeswari Fires On CM Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 6:21 PM IST

BJP Leader Purandeswari Fires On CM Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాక్షస పాలనలో ప్రజలంతా బాధితులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఎన్నికల ముంగిట వేదికపైకి ఎక్కి నా బీసీ అంటూ ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలపై కనీస సానుభూతి లేని ఈ ముఖ్యమంత్రి కొనసాగడం అవసరమా? అని ప్రశ్నించారు.

BJP Leader Purandeswari Fires On CM Jagan
BJP Leader Purandeswari Fires On CM Jagan

BJP Leader Purandeswari Fires On CM Jagan :రాష్ట్రంలో సాగుతోన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాక్షస పాలనలో ప్రజలంతా ఈ‌ ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఎన్నికల ముంగిట వేదికపైకి ఎక్కి నా బీసీ అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బీసీ అనేది సీఎం జగన్ రెడ్డి పెదాలపై తప్ప ఆయన గుండెల్లో లేదని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పురందేశ్వరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పరిపాలన తీరుపై ప్రసంగిస్తూ నిప్పు చెరిగారు.

'ఈ దాహం తీరనిది!' వచ్చే ఏడాది అప్పులూ ఇప్పుడే- ₹20వేల కోట్ల రుణానికి జగన్​ సిద్ధం - YCP govt take loans

ప్రతి ఒక్కరిపై రెండు లక్షల రూపాయల అప్పు ఉంది : బీసీలపై కనీస సానుభూతి లేని ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కొనసాగడం అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అధోగతి చేసిన పాలన జగన్ రెడ్డిది అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో‌ ప్రతి ఒక్కరిపైనా రెండు లక్షల రూపాయల అప్పు భారం ఉందని అన్నారు. ఇవి చాలవన్నట్లుగా సచివాలయం, రాష్ట్రంలో‌ గనులు కూడా తనఖా పెడుతున్నారని గుర్తు చేశారు. అదేమిటంటే ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా? అని ఆ పార్టీ నాయకుడు వ్యంగ్య భాణాలు సంధిస్తున్నారని తెలిపారు. సుపరిపాలన అందిస్తారని ప్రజలు అధికారం అప్పగిస్తే, అడ్డగోలుగా దోచుకుని ప్రభుత్వం ఆస్తులు తనఖా పెట్టమని కాదన్నారు.

రైతులకు 2కోట్ల అప్పు ఉన్న సీఎం జగన్- మూడు నెలలైనా చెల్లించకుండా జాప్యం - Penamaluru Farmer Suicide Attempt

పేదల బతుకులు‌ నాశనం చేశారు :మద్యం నియంత్రణ అన్నవారు మద్యాన్ని ఏరులై పారించారని, అధికార పార్టీ నాయకుల ధన దాహంతో మహిళలను వితంతువులుగా మార్చారని, పిల్లలకు తండ్రి లేని‌ వారిగా మార్చి, పేదల బతుకులు‌ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీనివాస్, బీజేపీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

"జగన్ మోహన్ రెడ్డి నా బీసీలు అని చెప్పి గుండెలు బాదుకోవడం కాదు. నిజంగా నీ గుండె బీసీల కోసం కొట్టుకోవాలి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. రాష్ట్రంలో‌ ప్రతి ఒక్కరిపైనా రెండు లక్షల రూపాయల అప్పు భారం ఉంది."-దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు

అప్పులు చేయటంలో జగన్ పీహెచ్​డీ: లోకేశ్

వైఎస్సార్సీపీ రాక్షస పాలనలో ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల అప్పుల భారం మోపారు: పురందేశ్వరి

ABOUT THE AUTHOR

...view details