తెలంగాణ

telangana

కారు, బస్సు ఢీ- ఐదుగురు దుర్మరణం, 11మందికి తీవ్ర గాయాలు - Road Accident In Maharashtra

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 9:21 AM IST

Updated : Apr 18, 2024, 1:22 PM IST

Road Accident In Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందగా, మరో 11మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లో డ్రైవర్​ నిద్రమత్తు కారణంగా ఓ కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మరణించారు.

Road Accident In Maharashtra
Road Accident In Maharashtra

Road Accident In Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. మరో 11మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన బీజాపుర్ గుహాగర్​ జాతీయ రహదారిపై జాంబుల్​వాడి ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

కర్ణాటక బాగల్​కోట్​లోని జమఖండికి చెందిన కొంతమంది రెండు కార్లలో మహారాష్ట్రలోని సాంగలీ గ్రామంలో జరుగుతున్న పెళ్లికి బయలుదేరారు. బుధవారం సాయంత్రం జాంబుల్​వాడి ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావటం వల్ల మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది ఇబ్బంది పడ్డారు.

డివైడర్​ను ఢీకొట్టిన కారు - ఇద్దురు చిన్నారులతో సహా నలుగురు మృతి
Car Accident In Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్​ ఎటా జిల్లాలోని అలీగఢ్, కాన్పుర్ హైవేపై ఓ కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. గురవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి చెందారు. మరో 5మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

హైవేపైకి వచ్చిన తర్వాత డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులు, గాయపడిన వారు నోయిడాలో పని చేస్తున్న మైన్​పురికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు మైన్​పురికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

ఎన్నికల వేళ నక్సలైట్లు కలకలం- ఎలక్షన్ బహిష్కరించాలని వార్నింగ్! ఏకంగా పోలింగ్​ బూత్​లోకి వెళ్లి! - Lok Sabha Elections 2024

ఓటింగ్ టైంలో EVM పనిచేయకుంటే ఏం జరుగుతుంది? ఓటరు తప్పు బటన్‌ను నొక్కితే ఏం చేయాలంటే? - LOK SABHA ELECTION 2024

Last Updated :Apr 18, 2024, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details