తెలంగాణ

telangana

'ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్​గా భారత్​- దేశాభివృద్ధిలో యువత భాగం'

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 11:42 AM IST

Updated : Feb 12, 2024, 12:28 PM IST

PM Modi Rojgar Mela : గత ప్రభుత్వాలు ప్రకటన నుంచి నియామకం చేసే వరకు చాలా సమయం పట్టేదని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్​గార్​ మేళాలో ప్రసంగించారు ప్రధాని మోదీ.

pm modi rojgar mela
pm modi rojgar mela

PM Modi Rojgar Mela : పదేళ్లలో గత ప్రభుత్వం కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2014 నుంచి ప్రతి యువకుడిని దేశాభివృద్ధిలో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు. అంతకుముందు ప్రభుత్వాలు ప్రకటన నుంచి నియామకం చేసే వరకు చాలా సమయం పట్టేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు నియామకాల్లో అవినీతికి పాల్పడేవని, కానీ తాము నియామక ప్రక్రియను పారదర్శకంగా మార్చామన్నారు. నియామక ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తి చేసేలా చేశామని, దీంతో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు వస్తాయని చెప్పారు. రోజ్​గార్​ మేళాలో (rojgar mela 2024 central government) భాగంగా సుమారు లక్ష మందికి పైగా యువకులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు ప్రధాని మోదీ.

"ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థ మన సొంతం. ప్రస్తుతం దేశంలో 1.25లక్షల స్టార్టప్​లు (narendra modi on startup) ఉన్నాయి. అనేక చిన్న పట్టణాలు, నగరాల్లోని యువకులు సైతం వీటిని ప్రారంభిస్తున్నారు. ఇవి అనేక ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి. మా ప్రభుత్వం స్టార్టప్​లకు అనేక పన్ను మినహాయింపులను ఇస్తుంది. పరిశోధన, అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వాలు ప్రజల బాధలను విస్మరించాయి. 2014 తర్వాత రైల్వేలు ఆధునీకరణపై దృష్టి పెట్టాము. ఈ సారి కేంద్ర బడ్జెట్​లో 40,000 సాధారణ బోగీలను వందేభారత్​ ప్రమాణాలకు మార్చాలి అని నిర్ణయించాం."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మాలిక సదుపాయల కోసం ఎక్కువ నిధులు
తమ ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికంగా పెట్టుబడి పెడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్​ రూఫ్​లను (modi solar rooftop scheme) బిగించే పథకంతో అనేక ఉద్యోగాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. రోజ్​గార్​ మేళా కార్యక్రమంలో పాల్గొనే ముందు దిల్లీలో కర్మయోగి భవన్​కు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ.

'లోక్​సభ ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 370 సీట్లు- కాంగ్రెస్​ తుడిచిపెట్టుకుపోవడం పక్కా!'

'సవాళ్లున్నా ఆగని అభివృద్ధి- ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు- ప్రజల ఆశీర్వాదం మళ్లీ మాకే'

Last Updated :Feb 12, 2024, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details