తెలంగాణ

telangana

పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - Venkaiah Naidu Padma Vibhushan

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 6:23 PM IST

Updated : Apr 22, 2024, 6:50 PM IST

Padma Vibhushan Venkaiah Naidu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ఆయనతోపాటు మరికొందరు కూడా పద్మ అవార్డులను స్వీకరించారు.

padma vibhushan venkaiah naidu
padma vibhushan venkaiah naidu

Padma Vibhushan Venkaiah Naidu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్‌ అవార్డును అందుకున్నారు. వెంకయ్య నాయుడుతోపాటు సులభ్‌ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్‌ పాఠక్‌ బదులు ఆయన సతీమణి అమోలా పాఠక్ అవార్డును స్వీకరించారు. నటుడు మిథున్ చక్రవర్తి, కేంద్ర మాజీమంత్రి రామ్ నాయక్, గాయని ఉషా ఉథుప్‌ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. క్రీడాకారుడు రోహన్ బోపన్న సహా పలువురు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.

కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికం, ఇంజినీరింగ్‌, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసి గౌరవిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అసాధారణమైన విశిష్ట సేవలు చేసినవారికి పద్మవిభూషణ్‌, ఉన్నతస్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్‌, విశిష్ట సేవలు అందించినవారిని పద్మశ్రీ అవార్డులతో సత్కరిస్తోంది.

మొత్తం 132 మందికి!
2024లో వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 132 పద్మ పురస్కారాల్లో 5 పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 110 పద్మశ్రీలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది.

పద్మవిభూషణ్- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, సీనియర్‌ నటీమణి వైజయంతి మాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, సులభ్‌ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్‌ పాఠక్​కు పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది కేంద్రం.

పద్మభూషణ్-దివంగత జస్టిస్‌ ఫాతిమా బీవీ, కేంద్ర మాజీమంత్రి రామ్‌నాయక్‌, మరో కేంద్ర మాజీ మంత్రి ఒ.రాజగోపాల్‌, ప్రముఖ గాయని ఉషా ఉథుప్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్‌ శర్మ, నటుడు మిథున్‌ చక్రవర్తి, కోలీవుడ్​ దివంగత నటుడు విజయ్‌కాంత్‌ సహా పలువురికి కేంద్రం పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది.

Last Updated : Apr 22, 2024, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details