తెలంగాణ

telangana

నెలన్నరగా లివ్​ ఇన్ రిలేషన్- యువతిని చంపి అల్మారాలో కుక్కిన వ్యక్తి- పోలీసులు వచ్చినప్పటికే! - Lover Killed His Girlfriend

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 8:20 AM IST

Boyfriend Killed His Girlfriend In Delhi : నెలన్నరగా తన ప్రియుడితో లివ్​-ఇన్​-రిలేషన్​లో ఉన్న ఓ 26 ఏళ్ల యువతి హత్యకు గురైంది. ఆమెను చంపి అల్మారాలో కుక్కి పరారయ్యాడు నిందితుడు. దిల్లీలో జరిగిందీ ఘటన.

Woman Living In Live In Relationship Murdered In Delhi
Woman Living In Live In Relationship Murdered In Delhi

Boyfriend Killed His Girlfriend In Delhi :నెలన్నరగా సహజీవనం చేస్తున్న ఓ 26 ఏళ్ల యువతి తన ప్రియుడి చేతిలోనే హతమైంది. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దిల్లీలోని దబ్రీ స్టేషన్​ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయాలతో ఉన్న ఆమె మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రి తరలించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చంపి అల్మారాలో కుక్కి!
గుజరాత్​ సూరత్​కు చెందిన విపుల్​ టైలర్​తో ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​కు చెందిన ఓ యువతి గత నెలన్నరగా లివ్​-ఇన్​-రిలేషన్​లో ఉంది. వీరిద్దరు కలిసి దిల్లీ ద్వారకా రాజాపురి ప్రాంతంలో ఓ ఫ్లాట్​ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు విపుల్​ యువతిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి ఫోన్​ చేసి చెప్పింది. బాయ్​ఫ్రెండ్​ తనను చంపేస్తాడేమోననే భయాన్ని కూడా మృతురాలు తండ్రితో వ్యక్తం చేసింది.

దీంతో బాధితురాలి తండ్రి హుటాహుటిన తన కుమారుడితో కలిసి దిల్లీకి చేరుకున్నారు. వెంటనే సంబంధిత దబ్రీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫారెన్సిక్​ బృందంతో కలిసి ప్రేమికులు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. తనిఖీల్లో భాగంగా ఇంట్లోని అల్మారాలో యువతి మృతదేహం లభించింది. ఈ క్రమంలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలను గుర్తించారు. దీంతో విపుల్​ టైలరే తన ప్రేయసిని తీవ్రంగా కొట్టి చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం యువతి మృతదేహాన్ని అల్మారాలో దాచి పారిపోయాడని చెబుతున్నారు.

Girl Living In Live-In Relationship Murdered : 'విచారణలో భాగంగా వీరు(ప్రేమికులు) నివసిస్తున్న ఫ్లాట్​ పక్కన ఉండేవాళ్ల ద్వారా కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఇద్దరూ తరచూ గొడవపడుతూ ఉండేవారని, ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇలా జరిగిందని వారు చెప్పారు' అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీలోని సెక్షన్​ 302 కింద మర్డర్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న విపుల్​ టైలర్​ కోసం ముమ్మరంగా గాలించారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వీటి ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

హిమాచల్​లో భూకంపం- భయంతో ప్రజలు పరుగే పరుగు! - Earthquake In Himachal Pradesh

99శాతం ఇండిపెండెంట్లకు డిపాజిట్లు గల్లంతు- ఇదీ ఈసీ లెక్క - Independent Candidates deposits

ABOUT THE AUTHOR

...view details