ప్రతిధ్వని: కరోనా కష్టకాలంలో సీతమ్మ కనికరించేనా?

By

Published : Jan 29, 2021, 12:43 AM IST

thumbnail

కరోనా వల్ల దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ప్రజల చేతిలో ఒక్కసారిగా నగదు లేకుండా పోయింది. వాణిజ్య, వ్యాపార వర్గాలతో సహా వేతన జీవులూ అల్లాడిపోతున్నారు. మధ్యతరగతి ప్రజల బడ్జెట్​ కుదేలైంది. ఫలితంగా రెండు రోజుల్లో పార్లమెంట్​ ముందుకు రానున్న కేంద్రపద్దు వైపు.. అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. వేతనాలు చెల్లించే వారందరూ బడ్డెట్​ సమయంలో తమకేమైనా రాయితీలు వస్తాయా? తమ ఆదాయ పన్నులో ఏమైనా మినహాయింపులు ఉంటాయా? అని ఆశగా చూడడం ప్రతిసారి మామూలైపోయింది. ఈసారి అలాంటి ఆశలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఆత్మ నిర్భర భారత్​ ప్యాకేజీతో కొన్ని రంగాలను ఆదుకున్న మాదిరిగానే తమకూ అలాంటి ప్రకటనలేమైనా ఉంటాయా? అని మధ్యతరగతి వేతన జీవుల్లో ఆశ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శ్లాబులపై 'ప్రతిధ్వని' ప్రత్యేక చర్చ చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.