నిత్యం ప్రజా సమస్యలతో తలమునకలయ్యే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్.. కొత్తగా సింగర్ అవతారం ఎత్తాడు. తన తండ్రి దివంగత నోముల నర్సింహయ్యను తలుచుకుని ప్రముఖ గాయకులు సాయి చంద్ పర్యవేక్షణలో పాట పాడారు. 'నా దారి నువ్వే నాన్నా.. నా ధైర్యం నువ్వే నాన్నా..' అంటూ సాగే గీతాన్ని స్వయంగా ఆలపించారు. ఎమ్మెల్యే పాడిన ఈ పాట ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి వినేయండి.