శిమ్లా వెళ్లి వస్తుండగా లోయలో పడ్డ కాంగ్రెస్​ ఎమ్మెల్యే కారు.. స్వల్ప గాయాలతో..

By

Published : Sep 1, 2022, 11:57 AM IST

thumbnail

Congress MLA Car Accident : శిమ్లా పర్యటనకు వెళ్లి వస్తున్న ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యే కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అనంతరం బోల్తా పడి చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన హిమాచల్​ ప్రదేశ్​లోని సోలన్​ జిల్లాలో జరిగింది. పంజాబ్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాణా గుర్జీత్​ సింగ్.. కారులో శిమ్లా పర్యటనకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో అటవీ ప్రాంతంలో ఆయన కారు అదుపు తప్పి లోయలో పడింది. స్పల్వగాయాలతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే నాయకులు చండీగఢ్​ ఆస్పత్రికి గుర్జీత్​ సింగ్​ను తరలించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సోలన్​ పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.