చెస్​ ఒలింపియాడ్​ స్పెషల్​.. ఈ 'చదరంగం' వంతెనను చూశారా?

By

Published : Jul 17, 2022, 5:19 PM IST

thumbnail

తమిళనాడులో ఓ వంతెన చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చదరంగం బోర్డు తరహాలో నలుపు, తెలుపు గడుల సమాహారంతో ముస్తాబు చేసిన మహాబలిపురం నేపియర్‌ వంతెన కనువిందు చేస్తోంది. ఈనెల 28వ తేదీ నుంచి మహాబలిపురంలో 44వ ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నేపియర్‌ వంతెనను చెస్‌ బోర్డు తరహాలో తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఏఎస్‌ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్​లో షేర్​ చేశారు. "భారతదేశ చెస్ రాజధాని చెన్నై గ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఐకానిక్ నేపియర్ బ్రిడ్జ్‌ చెస్ బోర్డులా ముస్తాబైంది" అంటూ రాసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.