World Cup Trophy Tour : తాజ్​మహల్​ ముందు ప్రపంచకప్​ ట్రోఫీ.. ఫ్యాన్స్​ సందడే సందడి

By

Published : Aug 16, 2023, 1:27 PM IST

thumbnail

World Cup Trophy Tour : భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్​కు సర్వం సిద్ధమౌతోంది. ఈ క్రమంలో అటు బీసీసీఐతో పాటు ఇటు ఐసీసీ ఈ వేడుకల కోసం సన్నాహాలు చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభమవ్వనందున ప్రమోషనల్ ఈవెంట్లను సైతం ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 18 దేశాలను చుట్టిరానున్న వరల్డ్​ కప్​ ఇప్పుడు ఆగ్రాకు చేరుకుంది. ఆగ్రాలోని ప్రసిద్ధ కట్టడమైన తాజ్​ మహల్ ముందు బుధవారం కనువిందు చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఫొటో షూట్​ కోసం  తాజ్ మహాల్ ముందు ప్రదర్శంచిన ఆ కప్​ను చూసేందుకు క్రికెట్​ లవర్స్​ తరలివచ్చారు. ఫొటోలు, ​ వీడియోలు తీస్తూ కాసేపు అక్కడే ఉండిపోయారు. 

World Cup 2023 Trophy : జూన్ 27న భారత్‌లో ప్రారంభమైన ఈ ట్రోఫీ టూర్ ఇప్పుడు ఆగ్రాకు చేరుకోవడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక  భారత్​ పర్యటన ముగించుకుని ఈ ట్రోఫీ  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,  యుఎస్ఎ, వెస్టిండీస్, పాకిస్థాన్, ఫ్రాన్స్, పాపువా న్యూ గినియా, ఇటలీ సహా 18 దేశాలకు వెళ్లనుంది. ఆ తర్వాత  తిరిగి సెప్టెంబర్ 4న భారత్ చేరుకోనుంది. బీసీసీఐ- ఐసీసీ సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 10 లక్షల మందికి ఈ ట్రోఫీని నేరుగా చూసే అవకాశం కలగనుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.