Prathidwani : 'ధరణి' సమస్యలు ఇకనైనా తీరేనా..?

By

Published : May 6, 2023, 9:08 PM IST

thumbnail

Prathidwani Debate on Dharani Problems : భూ సమస్యల పరిష్కారం కోసం రైతన్నలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగినా.. సమస్యలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేది. నేడు ప్రతిదీ ఆన్​లైన్​మయం.. రాష్ట్రంలో వ్యవసాయ భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ దస్త్రాల నిర్వహణకు.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధరణి పోర్టల్‌ రూపొందించింది. కానీ ఇది తప్పుల తడకగా ఉంది. ధరణి సమస్యలు తీరేది ఎప్పుడు..? ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర హైకోర్టుకు చేరింది. లోపాలమయంగా మారిన నూతన వ్యవస్థలో గుర్తించిన 20 సమస్యలను 4 వారాల్లోగా పరిష్కరించాలని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌తో పాటు సర్టిఫైడ్ కాపీలు ఇవ్వకపోవడం, ఇతర ధరణి సమస్యల పరిష్కారంలో జాప్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయి. మరిప్పుడు ధరణి విషయంలో జరగాల్సిన కార్యాచరణ ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.