'డంకీ సూపర్ హిట్ అయ్యేలా చూడు సాయి!'- షిర్డీ బాబాకు షారుక్ స్పెషల్ పూజలు

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 8:31 PM IST

Updated : Dec 14, 2023, 9:45 PM IST

thumbnail

Shahrukh Khan Visits Shirdi Temple : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్​ ఖాన్​ తన కుమార్తె సుహానా ఖాన్​తో షిర్డీ సాయి బాబాను దర్శించుకున్నారు. సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షారుక్ ఖాన్​కు సాయి సంస్థాన్ ట్రస్ట్ ఎక్జిక్యూటివ్ అధికారి పి శివ శంకర్ సన్మానం చేశారు. ప్రత్యేక విమానంలో  షిర్డీ ఎయిర్​పోర్టు చేరుకున్న షారుక్​ అక్కడి నుంచి కారులో సాయి బాబా ఆలయానికి వెళ్లారు. వీఐపీ గేట్​ ద్వారా గర్భగుడిలోకి వెళ్లారు. ఈ క్రమంలో సెల్ఫీల కోసం అభిమానులు దారి వెంట గుమిగూడారు. అంతకుముందు షారుక్ ద్వారకామయిని కూడా దర్శించుకున్నారు. షారుక్ ఇటీవల జమ్ముకశ్మీర్​లో ఉన్న వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.

మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే 'పఠాన్', 'జవాన్​'తో హిట్స్​ అందుకున్న షారుక్​ మరోసారి 'డంకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల విడుదల కానుంది. నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. 22న రెబల్​ స్టార్ ప్రభాస్ 'సలార్' కూడా ప్రేక్షకుల ముందుకు రాబతోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోల సినిమాల మధ్య హోరాహోరీ పోటీ ఏర్పడింది.  

Last Updated : Dec 14, 2023, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.