'డంకీ సూపర్ హిట్ అయ్యేలా చూడు సాయి!'- షిర్డీ బాబాకు షారుక్ స్పెషల్ పూజలు
Published : Dec 14, 2023, 8:31 PM IST
|Updated : Dec 14, 2023, 9:45 PM IST
Shahrukh Khan Visits Shirdi Temple : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్తో షిర్డీ సాయి బాబాను దర్శించుకున్నారు. సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షారుక్ ఖాన్కు సాయి సంస్థాన్ ట్రస్ట్ ఎక్జిక్యూటివ్ అధికారి పి శివ శంకర్ సన్మానం చేశారు. ప్రత్యేక విమానంలో షిర్డీ ఎయిర్పోర్టు చేరుకున్న షారుక్ అక్కడి నుంచి కారులో సాయి బాబా ఆలయానికి వెళ్లారు. వీఐపీ గేట్ ద్వారా గర్భగుడిలోకి వెళ్లారు. ఈ క్రమంలో సెల్ఫీల కోసం అభిమానులు దారి వెంట గుమిగూడారు. అంతకుముందు షారుక్ ద్వారకామయిని కూడా దర్శించుకున్నారు. షారుక్ ఇటీవల జమ్ముకశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.
మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే 'పఠాన్', 'జవాన్'తో హిట్స్ అందుకున్న షారుక్ మరోసారి 'డంకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల విడుదల కానుంది. నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. 22న రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' కూడా ప్రేక్షకుల ముందుకు రాబతోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోల సినిమాల మధ్య హోరాహోరీ పోటీ ఏర్పడింది.