Prathidwani: టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన ఏపీ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది..?

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 9:12 PM IST

thumbnail

Pratidhwani Debate on TDP and Janasena Alliance: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన కలిసే పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ విస్పష్ట ప్రకటన చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం ఈ కీలక నిర్ణయాన్ని పనన్ కల్యాణ్ వెల్లడించారు. మరి ఈ రెండు పార్టీల పొత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మా కోసం కాదు పొత్తు పెట్టుకునేది రాష్ట్ర భవిష్యత్తు కోసం అని పవన్ అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు అంత ప్రమాదంలో పడటానికి కారణం ఏంటి? పొత్తు ప్రకటనతో పాటు ఇరుపార్టీల ప్రతినిధుల మాటల్లో ఉన్న ఇతర సందేశాలు ఏమిటి ? రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాము, ఇకపై కలిసి పనిచేస్తాము అని చంద్రబాబును కలిసి వచ్చిన అనంతరం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంద్రప్రదేశ్‌ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.