విరిగిన రైలు చక్రం! అలాగే 10 కి.మీ ప్రయాణం.. ప్రయాణికులు అలర్ట్ అయి..

By

Published : Jul 3, 2023, 8:07 AM IST

Updated : Jul 3, 2023, 10:30 AM IST

thumbnail

బిహార్​ వైశాలి జిల్లాలో పవన్ ఎక్స్​ప్రెస్​ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎస్​ 11 బోగీలోని ఓ చక్రం దెబ్బతింది. దీనిని డ్రైవర్ గమనించకుండా సుమారు 10 కిలోమీటర్లు వెళ్లనిచ్చారు. ప్రయాణికులు గమనించి లోకో పైలట్​కు చెప్పడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రైలులోని ప్రయాణికులు అనేక గంటల పాటు అక్కడే ఉండిపోయారు. ఈ ఘటన ముజఫర్​పుర్​-హాజిపుర్​ రైల్వే సెక్షన్ మధ్య జరిగింది.

ఇదీ జరిగింది
జయనగర్​ నుంచి లోకమాన్య తిలక్​ టెర్మినల్​కు వెళ్తున్న పవన్ ఎక్స్​ప్రెస్​లోని ఓ రైలు చక్రం విరిగిపోయింది. దీనిని లోకో పైలట్ గమనించలేదు. దాదాపు 10 కిలోమీటర్లు అలాగే రైలును నడిపించుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత శబ్దం విన్న ప్రయాణికులు.. లోకో పైలట్​కు తెలియజేశారు. "ముజఫర్​పుర్​ స్టేషన్​ నుంచి రైలు బయలుదేరగానే.. కొద్దిగా శబ్దం వచ్చింది. స్పీడ్​ పెరిగే కొద్ది రైలులో శబ్దం మరింతగా పెరిగింది. ఆ తర్వాత భగవాన్​పుర్​ స్టేషన్​ వద్ద రైలు ఆగితే.. దిగి చూశాను. ఓ చక్రం విరిగిపోయి కనిపించింది. ఇంతలోనే రైలు స్టేషన్​ నుంచి బయలుదేరింది. దీంతో వెంటనే గొలుసు లాగి రైలును ఆపాము. వెంటనే వెళ్లి డ్రైవర్​కు ఈ విషయం చెప్పాము" అని ఓ ప్రయాణికుడు వివరించాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. ఘటనా స్థలానికి మరమ్మతుల బృందాన్ని పంపించారు. రైలు సమయానికి ఆపకపోతే భారీ ప్రమాదం జరిగేదన్నారు ఉత్తర మధ్య రైల్వే సీపీఆర్​వో బీరేంద్ర కుమార్​.

Last Updated : Jul 3, 2023, 10:30 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.