లారీలో వచ్చి ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు.. మెషీన్ బద్దలు కాలేదని..

By

Published : Jul 10, 2023, 7:44 AM IST

thumbnail

Nashik ATM Stolen : ఆర్​పీఎఫ్​ జవాన్​ల ట్రైనింగ్ క్యాంపు సమీపంలోని ఏటీఎం మెషీన్​ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఏటీఎం బద్దలు కాకపోవడం వల్ల ఏకంగా మెషిన్​ను ట్రక్కులో ఎక్కించి పరారయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర నాశిక్​లో జరిగింది.
దొంగతనం జరిగింది ఇలా..
ఆదివారం తెల్లవారుజామున.. సమన్​గావ్ ప్రాంతంలోని ఆర్​పీఎఫ్ ట్రైనింగ్ క్యాంపు సమీపంలో ఉన్న ఏటీఎంలో చోరీకి నలుగురు దొంగలు వచ్చారు. ఏటీఎంను పగులగొట్టేందుకు విఫలయత్నం చేసిన దొంగలు.. ఏకంగా మెషీన్​నే ట్రక్కులో ఎక్కించి అక్కడనుంచి పరారయ్యారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అదీ పోలీస్ ట్రైనింగ్​ సమీపంలో దొంగతనం జరగడం గమనార్హం. దొంగతనం దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. క్రైమ్ డిపార్ట్​మెంట్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా దొంగలు మెషీన్​ను ఎత్తుకెళ్లే సమయానికి ఏటీఎంలో ఎంత నగదు ఉందో అన్నదానిపై స్పష్టత రాలేదు.

సమన్​గావ్ క్యాంపునకు దేశ నలుమూలల నుంచి.. ఆర్​పీఎఫ్​ జవాన్లు, అధికారులు శిక్షణ కోసం వస్తారు. అయితే ఈ ప్రాంతం పట్టణానికి దూరంగా ఉండడం వల్ల.. జవాన్లు నగదు ఉపసంహరించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారి సౌకర్యం కోసం అధికారులు స్థానికంగా ఏటీఎంను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం అదే ఏటీఎం చోరీకి గురైంది.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.