Etela Rajender: 'దళితబంధులో అవినీతి జరుగుతుందని కేసీఆర్​ స్వయంగా చెప్పారు'

By

Published : Apr 28, 2023, 7:40 PM IST

thumbnail

Etela Rajender comments on Dalit Bandhu: దళిద బంధు పథకంలో కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్​ స్వయంగా ప్రకటించారని​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను వెంటనే ప్రభుత్వం నుంచి బర్తరఫ్​ చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. హుజూరాబాద్​లో డ్రైవర్ల బీమా పంపిణీ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. అవినీతికి పాల్పడిన డబ్బులను వెంటనే వాపసు చేసుకోవాలని సూచించారు. ఈ ఆరోపణలు ప్రతిపక్షాలు కానీ.. ఇతరులు కానీ చేయలేదని.. స్వయంగా ముఖ్యమంత్రే చేశారని గుర్తు చేశారు. దళిత బంధును గొప్పగా అమలు చేస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పినా.. ఎన్నో కొర్రీలు పెట్టి అర్హులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి రూ.2 వేల కోట్లను కేటాయించినట్లు చెబుతున్న సీఎం.. వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని ఈటల డిమాండ్​ చేశారు. చాలా మంది ప్రజాప్రతినిధులు అవినీతిలో మునిగిపోయారని విమర్శించారు. వెంటనే దళిత బంధు అందరికీ ఇవ్వడమే కాకుండా లంచంగా తీసుకున్న డబ్బు తిరిగి తీసుకొని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.