ట్రైన్కు ఎదురెళ్లి మరీ యువకుడు ఆత్మహత్య
ఝార్ఖండ్లో ఓ యువకుడు అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైన్కు ఎదురుగా వెళ్లి మరీ సూసైడ్ చేసుకున్నాడు. లోహర్దగా జిల్లా జరాసన్ మండలంలోని భత్ఖిజ్రి గ్రామానికి చెందిన 20 ఏళ్ల పింటూ కుమార్గా గుర్తించారు పోలీసులు. అతడిని గమనించిన గ్రామస్థులు వద్దని కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా లోహర్దగా నుంచి రాంచీ వెళ్తున్న ఓ ట్రైన్ కిందపడి మృతి చెందాడు. కొందరు ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొందరు యువకులు మాత్రం ఈ ఘటనను మొబైల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం వీడియో స్థానికంగా వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST