పొలంలో పనిచేస్తున్న రైతుపై చిరుత దాడి​.. కూతురు పట్టుకున్న కర్ర చూసి జంప్​!

By

Published : May 15, 2023, 3:36 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​లో పొలంలో పని చేస్తున్న ఓ రైతుకు ఊహించని ఘటన ఎదురైంది. అకస్మాత్తుగా వచ్చిన ఓ చిరుత అతడిపై దాడి చేసింది. సమీపంలోనే ఉన్న రైతు కుమార్తె అప్రమత్తమై కర్రతో చిరుత వైపు రావడం వల్ల అక్కడి నుంచి పారిపోయింది.

ఇదీ జరిగింది..
పీలీభీత్​ జిల్లాలోని సంతోష్​పురా గ్రామానికి చెందిన డోరీలాల్​(40).. తన కుమార్తె గోమతితో కలిసి సోమవారం ఉదయం పొలానికి వెళ్లాడు. డోరీలాల్​ పొలంలో పనిచేస్తున్న సమయంలో పొదల్లో నుంచి బయటకు వచ్చిన ఓ చిరుతపులి అతడిపై దాడి చేసింది. సమీపంలోనే ఉన్న అతడి కుమార్తె గోమతి ధైర్యం ప్రదర్శించి కర్రతో చిరుతను తరిమికొట్టింది. ఆ తర్వాత చిరుత పారిపోయింది. ఘటన అనంతరం వెంటనే రైతును దగ్గరలోని ఆస్పత్రికి స్థానికులు తరలించారు. 

చిరుత సంచారంపై సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది.. దాన్ని పట్టుకునేందుకు సంతోష్‌పురా గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ వ్యక్తి చిరుతకు దగ్గరగా వెళ్లాడు. ఆందోళనకు గురైన చిరుతపులి అతడిపై దాడి చేసి పారిపోయింది. చిరుతను పట్టుకుంటామని గ్రామస్థులకు అధికారులు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.